IPL 2021: ఆదిలోనే వికెట్లు కోల్పోకుంటే మరోలా ఆడేవాళ్లమేమో: విలియమ్సన్
దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆదిలోనే వికెట్లు కోల్పోకుంటే మరోలా ఆడేవాళ్లమని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆదిలోనే వికెట్లు కోల్పోకుంటే మరోలా ఆడేవాళ్లమని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఐపీఎల్ రెండో దశలో బుధవారం రాత్రి తొలి మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ మరోసారి పేలవ ఆటతీరు ప్రదర్శించింది. మరీ ముఖ్యంగా బ్యాటింగ్లో తడబడి 134/9 స్కోరే చేసింది. అనంతరం దిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
‘మేం శుభారంభం చేయలేకపోయాం. మంచి భాగస్వామ్యాలు నిర్మించలేకపోయాం. సానుకూలంగా ఆడే అవకాశాలు కూడా దక్కలేదు. చివర్లో ఫర్వాలేదనిపించినా ఇంకో 25-30 పరుగులు తక్కువే చేశాం. మా బౌలింగ్ అయితే బాగా ఉంది. గతంలో మోస్తరు లక్ష్యాలను కాపాడుకున్న అనుభవం మాకుంది. అయితే, ఈరోజు అది కుదరలేదు. సిగ్గుగా ఉంది కానీ.. ఆటను ఆస్వాదించాలి. ఒత్తిడికి లోనుకావొద్దు. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడింది. ఆ జట్టులో ఇద్దరు నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. మాపై ఆధిపత్యం చెలాయించారు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఒకవేళ మేం ఆదిలోనే వికెట్లు కోల్పోకపోయి ఉంటే మరోలా ఆడేవాళ్లం. మా ఆటలోని లోపాలపై దృష్టిసారించి మెరుగవ్వాలి’ అని విలియమ్సన్ అన్నాడు.
దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్పంత్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ తొలి దశలో బాగా ఆడాం.. ఇప్పుడు రెండో దశను కూడా విజయంతో ప్రారంభించడం సంతోషంగా ఉంది. మా ప్రణాళికలపై దృష్టిసారించి వాటికోసం వంద శాతం కష్టపడాలని అనుకున్నాం. మా బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. ప్రపంచంలోనే మేటి బౌలర్లను కలిగి ఉండటం వరంగా భావిస్తున్నా. సన్రైజర్స్ను 150-160 లోపు కట్టడి చేస్తే సరిపోతుందని అనుకున్నాం కానీ, 130కే పరిమితం చేయడం ఇంకా మంచిదనిపించింది’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.