IPL 2021: ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘన.. దినేశ్‌ కార్తీక్‌కు మందలింపు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ మందలింపునకు గురయ్యాడు. అతడు ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘించాడని పేర్కొంటూ టోర్నీ నిర్వహకులు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు...

Published : 14 Oct 2021 14:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ మందలింపునకు గురయ్యాడు. అతడు ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘించాడని పేర్కొంటూ టోర్నీ నిర్వహకులు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, అందులో అతడేం చేశాడ విషయం మాత్రం వెల్లడించలేదు. గతరాత్రి దిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో తలపడిన సందర్భంగా కార్తీక్‌ (0) ఛేదనలో డకౌటైనప్పుడు తన కోపాన్ని వికెట్లపై చూపించాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ‘ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌’ కింద తప్పు చేసినట్లు ఆంగీకరించాడని నిర్వహకులు తెలిపారు. అతడిపై మ్యాచ్‌ రిఫరీ తీసుకునే చర్యలు అంతిమం అని అందులో పేర్కొన్నారు.

ఈ మ్యాచ్‌లో దిల్లీ నిర్దేశించిన 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా మొదట తెలిగ్గా ఛేదించేలా కనిపించింది. 16 ఓవర్లకు 123/2 స్కోర్‌తో నిలిచి విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచింది. అయితే, ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటికి శుభ్‌మన్‌ గిల్ ‌(45), రాహుల్‌ త్రిపాఠి క్రీజులో ఉన్నారు. ఇక తర్వాత అవేశ్‌ఖాన్‌, రబాడ, నార్జె తర్వాతి మూడు ఓవర్లు కట్టుదిట్టంగా బంతులేసి 6 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశారు. గిల్(46), కార్తీక్‌ (0), మోర్గాన్‌ (0) ఔటయ్యారు. చివరి ఓవర్‌లో అశ్విన్‌ షకిబ్‌ (0), నరైన్‌ (0)ను కూడా పెవిలియన్‌ చేరడంతో ఆఖరి రెండు బంతుల్లో కోల్‌కతా విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలోనే ఐదో బంతిని రాహుల్‌ త్రిపాఠి (12) స్టాండ్స్‌లోకి తరలించి మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ క్రమంలోనే కార్తీక్‌ ఔటైనప్పుడు వికెట్లను తీసి పారేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు