IPL 2021: ఏమైంది..! ముంబయి ఇలా ఎందుకు ఆడుతోంది?
ముంబయి ఇండియన్స్కు ఏమైంది?గత రెండు సీజన్లలో టైటిల్ సాధించి ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్న ఆ జట్టు.. ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచింది...
ముంబయి ఇండియన్స్కు ఏమైంది?గత రెండు సీజన్లలో టైటిల్ సాధించి ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్న ఆ జట్టు.. ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచింది. మరీ ముఖ్యంగా ఆదివారం రాత్రి బెంగళూరుతో తలపడిన సందర్భంగా 111 పరుగులకే కుప్పకూలి.. ఈ సీజన్పై ఆశలు వదులుకునే పరిస్థితికి చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతున్నా.. ప్లేఆఫ్స్ చేరాలంటే మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఏ ఒక్కటి ఓడినా ముంబయి ఆశలు గల్లంతే! ఈ నేపథ్యంలో ఆ జట్టు ఓటములకు కారణాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
ఇప్పటివరకు ఎలా ఆడింది..?
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఏప్రిల్లో టోర్నీ ప్రారంభమైనప్పుడు గెలుపోటములతో దాగుడు మూతలు ఆడింది. తొలుత బెంగళూరుతో ఓటమిపాలైన ఆ జట్టు తర్వాత కోల్కతా, హైదరాబాద్లపై ప్రతాపం చూపించింది. ఆపై దిల్లీ, పంజాబ్ల చేతిలో విఫలమైనా తర్వాత రాజస్థాన్, చెన్నైలపై జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలోనే బయోబుడగలో కరోనా వైరస్ ప్రవేశించి టోర్నీ వాయిదా పడింది. అప్పటికి ముంబయి ఏడు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక రెండో దశలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడగా అన్నింట్లోనూ ఓటమిపాలైంది. తొలుత చెన్నైతో భంగపడిన ముంబయి ఆపై కోల్కతా, బెంగళూరు చేతుల్లోనూ మొట్టికాయలు తింది. దీంతో మొత్తం పది మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది.
బ్యాట్స్మెన్దే వైఫల్యం..?
ముంబయి టీమ్లో కెప్టెన్ రోహిత్ శర్మ (326), ఓపెనర్ క్వింటన్ డికాక్ (251) మాత్రమే రాణిస్తున్నారు. ఒకరు విఫలమైనా మరొకరు ఆదుకుంటున్నారు. ఇద్దరూ కలిసి బాగా ఆడినా.. తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ తేలిపోతున్నారు. అయితే ఇదే ఆ జట్టు ఓటములకు ప్రధాన సమస్యగా మారింది. అప్పుడప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ కీరన్ పొలార్డ్ (211) బ్యాట్కు పని చెబుతున్నా.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోతున్నాడు. గతేడాది సూపర్ బ్యాటింగ్తో జట్టుకు విజయాలు అందించిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఈసారి ఇబ్బందులు పడుతున్నారు. క్రీజులో నిలువలేక ప్రత్యర్థుల ముందు చిత్తవుతున్నారు. సూర్య ఆడిన 10 మ్యాచ్ల్లో 18.9 సగటుతో 189 పరుగులు చేయగా.. ఇషాన్ 8 మ్యాచ్ల్లో 13.37 సగటుతో 107 పరుగులే సాధించాడు. మరోవైపు ఎంతో నమ్మకం ఉన్న పాండ్య సోదరులు సైతం పూర్తిగా గాడి తప్పినట్లు కనిపిస్తున్నారు. కృనాల్ 10 మ్యాచ్ల్లో 13.44 సగటుతో 121 పరుగులు చేయగా హార్దిక్ 8 మ్యాచ్ల్లో 7.85 సగటుతో 55 పరుగులే చేశాడు. దీన్ని బట్టే ముంబయి బ్యాటింగ్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
స్పిన్ తిరగట్లేదెందుకు..?
ముంబయి ఇండియన్స్ మరో ప్రధాన బలం పేస్ బౌలింగ్. ఆ జట్టు ఎప్పుడూ ప్రపంచ శ్రేణి పేసర్లపై ఆధారపడుతుంది. ఈసారి కూడా బుమ్రా, ట్రెంట్ బౌల్ట్తో బరిలోకి దిగుతోంది. కానీ, టీమ్ఇండియా పేసర్ ఒక్కడే రాణిస్తున్నాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచిన కివీస్ పేసర్ ఈసారి ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఆడిన 10 మ్యాచ్ల్లో 8.20 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. మరోవైపు బుమ్రా తొలి దశలో ఆకట్టుకోలేకపోయినా రెండో దశలో చెలరేగుతున్నాడు. గత మూడు మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అయితే, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్పిన్ బౌలింగ్ గురించే. తొలి దశలో ప్రతి మ్యాచ్లోనూ వికెట్లు తీసి ఆకట్టుకున్న రాహుల్ చాహర్ రెండో దశలో పూర్తిగా చేతులెత్తేశాడు. గత మూడు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. ఇక కృనాల్ బౌలింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతడు పది మ్యాచ్ల్లో కేవలం 3 వికెట్లే తీసి లయ తప్పినట్లు కనిపిస్తున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్య అసలు బౌలింగే చేయకపోవడం ముంబయిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
వీరిని ఆడించొచ్చుగా..?
(ఫొటో: క్రిస్ లిన్ ట్విటర్)
ఈసారి ముంబయి ఇండియన్స్ జట్టులో ఇద్దరు బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా మెరిసిన వారు కూడా ఉన్నారు. అందులో ఒకరు క్రిస్లిన్ కాగా, మరొకరు సౌరభ్ తివారి. ఏప్రిల్లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు బెంగళూరుతో ఆడిన తొలి మ్యాచ్లోనే క్రిస్లిన్ (49) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ(19) విఫలమైనా లిన్ తన బ్యాటింగ్తో మెరిశాడు. అప్పుడు డికాక్ ఇంకా జట్టుతో కలవకపోవడంతో లిన్ బ్యాటింగ్ చేశాడు. కానీ అతడు ఆడింది ఆ ఒక్క మ్యాచే అయినా బ్యాటింగ్ మాత్రం అదరగొట్టాడు. తర్వాత డికాక్ జట్టులో చేరాక జట్టు యాజమాన్యం లిన్ను పక్కనపెట్టింది. అలాగే రెండో దశలో మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్య ఆడని రెండు మ్యాచ్ల్లో సౌరభ్ తివారీకి చోటిచ్చింది. కోల్కతాతో ఆడిన మ్యాచ్లో అతడు పెద్దగా ఆడే అవకాశం రాకపోయినా అంతకుముందు చెన్నైతో తలపడిన సందర్భంగా అర్ధశతకం సాధించాడు. అయినా ఇప్పుడతడిని పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో ముంబయి మిగతా మ్యాచ్ల్లో రాణించాలంటే వీరికి చోటిచ్చి చూడాలి.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్