IPL 2021: చెన్నైతో పోరులో ముంబయికి ఆ ఒక్కటే సమస్య
చెన్నై సూపర్ కింగ్స్తో తలపడే మ్యాచ్లో ముంబయి ఇండియన్స్కు ఒక్కటే సమస్య అని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్లోని రెండో దశ మరికొన్ని...
ఆకాశ్ చోప్రా
ఇంటర్నెట్డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్తో తలపడే మ్యాచ్లో ముంబయి ఇండియన్స్కు ఒక్కటే సమస్య అని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్లోని రెండో దశ మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ముంబయి, చెన్నై జట్లు తొలి మ్యాచ్లో తలపడనున్నాయి. అయితే, రోహిత్ సేన నెమ్మదిగా ఆరంభించడం మినహాయిస్తే మరే సమస్యా లేదని చోప్రా పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ముంబయి ఇండియన్స్ తన ఫేవరెట్ అని చెప్పాడు.
‘ముంబయి జట్టుకుండే ప్రధాన సమస్య చెన్నై పిచ్. ఇప్పుడా ఇబ్బంది లేదు. రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు. మిగతా ఆటగాళ్లు రాణిస్తే బాగుంటుంది. నెమ్మదిగా ఆరంభించడం మినహాయిస్తే ఆ జట్టుకు ఎలాంటి సమస్య లేదనే చెప్పాలి. తొలి బంతి నుంచే దంచికొట్టాలి. ఓపెనర్లుగా రోహిత్, డికాక్ బరిలోకి దిగుతారు. తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పాండ్య సోదరులు, పొలార్డ్ వరుసగా ఉన్నారు. వీళ్లంతా రాణిస్తే మంచి స్కోర్ సాధించగలరు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే రాహుల్ చాహర్ను కచ్చితంగా ఆడిస్తారు. తర్వాత ఉండే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరగాలి. ఇందులో ఆడం మిల్నే లేదా నాథన్ కౌల్టర్ నైల్.. ఇద్దరిలో ఒకర్ని తీసుకోవాలి. ఆడం అదనపు పేస్ వేయగలడు కాబట్టి అతడైతే బాగుంటుంది. చివర్లో బుమ్రా, బౌల్ట్ ఉన్నారు. దీంతో చెన్నైతో తలపడేందుకు ఈ జట్టు సరిగ్గా సరిపోతుంది. మరోవైపు ముంబయి ఆటగాళ్లకు ఎలాంటి గాయాల బెడద కూడా లేదు’ అని చోప్రా పేర్కొన్నాడు
మరోవైపు చెన్నై టీమ్పైనా స్పందించిన మాజీ క్రికెటర్.. ఈ మ్యాచ్లో చెన్నై శార్దూల్ ఠాకూర్ను కచ్చితంగా ఆడించాలన్నాడు. ఓపెనర్లుగా రుతురాజ్, డుప్లెసిస్ ఉన్నారని, ఆపై మొయిన్ అలీ, రైనా, అంబటి రాయుడు, కెప్టెన్ ధోనీ ఉన్నారని గుర్తుచేశాడు. అయితే, రైనా ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఒక్క అర్ధశతకమే సాధించిన నేపథ్యంలో ఇప్పుడు చెలరేగిపోవాలని సూచించాడు. ఇక బ్రావో, జడేజా కూడా ఆల్రౌండర్లుగా అందుబాటులో ఉండటంతో చెన్నై ఇక్కడి వరకూ బ్యాటింగ్ చేయగలదని తెలిపాడు. మరోవైపు సామ్కరన్ ఉండి ఉంటే ఇంకా బాగుండేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ విభాగం దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జోష్ హేజిల్వుడ్తో బలంగా ఉందన్నాడు. ముంబయిని కట్టడి చేయలంటే వీరంతా సమష్టిగా రాణించాలన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్