IPL 2021 - Sunrisers: హైదరాబాద్ ఆశలు అస్తమయం.. కారణాలివే!
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ది ప్రత్యేక ప్రస్థానం. డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో తొలిసారి టైటిల్ సాధించిన ఆ జట్టు ఆపై ఏటా ప్లేఆఫ్స్ చేరుతూ ప్రత్యేక గుర్తింపు సాధించింది...
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ది ప్రత్యేక ప్రస్థానం. డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో తొలిసారి టైటిల్ సాధించిన ఆ జట్టు ఆపై ఏటా ప్లేఆఫ్స్ చేరుతూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. అయితే, ఈసారి పేలవ ఆటతీరుతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. తాజాగా దిల్లీతో ఆడిన మ్యాచ్లోనూ ఓటమిపాలై ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు చేసుకుంది. ఒకవేళ ఇప్పుడైనా ప్లేఆఫ్స్ చేరాలనే ఆశలు ఉంటే ఇకపై మిగిలిన ఆరు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. అది కూడా ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వైఫల్యానికి గల కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
ఆడితే టాప్ ఆర్డరే..
సన్రైజర్స్ జట్టులో ప్రధాన బ్యాట్స్మెన్ బెయిర్స్టో, డేవిడ్ వార్నర్, కెప్టెన్ విలియమ్సన్, మనీశ్ పాండే. ఈ నలుగురు ఆడితేనే గౌరవప్రదమైన స్కోర్ చేస్తోంది. లేదంటే అంతే సంగతులు. రెండో దశలో బెయిర్స్టో ఆడని కారణంగా బ్యాటింగ్ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. బెయిర్స్టో ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో 41.33 సగటుతో 248 పరుగులు చేశాడు. దీంతో సన్రైజర్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తర్వాత మనీశ్ పాండే ఆరు మ్యాచ్ల్లో 42 సగటుతో 210 పరుగులతో కొనసాగుతున్నాడు. ఆపై డేవిడ్ వార్నర్ ఏడు మ్యాచ్ల్లో 27.57 సగటుతో 193 పరుగులతో మూడో స్థానంలో, విలియమ్సన్ ఐదు మ్యాచ్ల్లో 73 సగటుతో 146 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచారు. తర్వాత అబ్దుల్ సమద్ ఐదు మ్యాచ్ల్లో 16 సగటుతో 64 పరుగులు.. విజయ్ శంకర్ ఏడు మ్యాచ్ల్లో 11.60 సగటుతో 58 పరుగులు.. కేదార్ జాధవ్ ఐదు మ్యాచ్ల్లో 14.33 సగటుతో 43 పరుగులు.. మహ్మద్ నబి రెండు మ్యాచ్ల్లో 15.50 సగటుతో 31 పరుగులు.. వృద్ధిమాన్ సాహా మూడు మ్యాచ్ల్లో 8.66 సగటుతో 26 పరుగులు మాత్రమే చేశారు. దీన్ని బట్టి టాప్ నలుగురు మినహా మిడిల్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేసినట్లేనని స్పష్టంగా తెలుస్తోంది. జట్టులోని 26 మంది సభ్యుల్లో 21 మందిని ఆడించి చూసినా.. మెరుగైన జట్టు కూర్పును సాధించలేకపోవడం గమనార్హం.
బౌలింగ్ కూడా అంతంతే..
ఇదివరకు సన్రైజర్స్ బౌలింగ్కు మంచి పేరుండేది. బ్యాట్స్మెన్ తక్కువ పరుగులు సాధించినా.. జట్టు బౌలింగ్ విభాగం మాత్రం ఆకట్టుకునేది. ఎన్నో సందర్భాల్లో బౌలర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఇన్ని రోజులు అంత ప్రభావం చూపిన సన్రైజర్స్ బౌలింగ్ బృందం ఈ సీజన్లో మాత్రం విఫలమైంది. రషీద్ ఖాన్ మినహా మిగతా బౌలర్లెవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. రషీద్ ఎనిమిది మ్యాచ్ల్లో 6.18 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టి ఈ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు ఎంతో అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ పూర్తిగా తేలిపోయాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో 8.81 ఎకానమీతో 3 వికెట్లే తీశాడు. ఖలీల్ అహ్మద్ ఆరు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు.. విజయ్ శంకర్, సిద్ధార్థ్ కౌల్ చెరో మూడు వికెట్లు మాత్రమే తీశారు. గత సీజన్లలో ఆకట్టుకున్న సందీప్ శర్మ నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఇక గాయాల కారణంగా నటరాజన్, హోల్డర్ తొలి భాగంలో దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా కారణంగా నటరాజన్ మరోసారి దూరమయ్యాడు. దీంతో ఈసారి జట్టు బౌలింగ్ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి.
ఎనిమిదిలో నాలుగు గెలవాల్సినవే..
ఈ సీజన్లో సన్రైజర్స్ ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో నాలుగు గెలిచే అవకాశం లభించినా చేజేతులా ఓటమి పాలైంది. తొలి అర్ధభాగంలో కోల్కతా, బెంగళూరు, ముంబయి, దిల్లీ జట్లతో ఆడిన మ్యాచ్ల్లో హైదరాబాద్ టీమ్ సునాయాస విజయాలు సాధించాల్సి ఉంది. కానీ, మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో ఆ మ్యాచ్లన్నీ కోల్పోయింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
* ఏప్రిల్లో ఈ సీజన్లో మొదలైనప్పుడు తొలి మ్యాచ్లో కోల్కతా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్రైజర్స్ అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు సాహా (7), వార్నర్(3) విఫలమైనా... మనీశ్ పాండే(61), జానీ బెయిర్స్టో(55) మ్యాచ్ను మలుపు తిప్పారు. అయితే, కీలక సమయంలో ఇద్దరూ ఔటవ్వడంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వైఫల్యంతో విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచి తొలి ఓటమి చవిచూసింది.
* ఇక రెండో మ్యాచ్లో బెంగళూరు 149/8 స్కోర్ చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ అలవోకగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. సాహా(1) మరోసారి విఫలమయ్యాడు. కానీ, వార్నర్(54), మనీష్(38) ఆదుకున్నారు. వీరిద్దరూ ఔటయ్యాక మిగతా బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్ విజయానికి చేరువగా వచ్చి 143/9 పరుగులకే పరిమితమైంది. ఇలా రెండోసారి ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
* ముంబయితో తలపడిన మ్యాచ్లోనూ సన్రైజర్స్ గెలవాల్సిన పరిస్థితి. ఆ జట్టు నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని హైదరాబాద్ టీమ్కు షాకిచ్చింది. ఓపెనర్లు వార్నర్(36), బెయిర్స్టో(43) సగం స్కోర్ పూర్తిచేసినా మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. మనీశ్ పాండే(2) నిరాశ పర్చాడు. మరోవైపు విజయ్ శంకర్(28) పోరాడినా అతడికి సహకరించే బ్యాట్స్మెన్ లేక 13 పరుగుల తేడాతో పరాభవం పాలైంది.
* ఇక నాలుగో మ్యాచ్లో పంజాబ్పై 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన సన్రైజర్స్ ఐదో మ్యాచ్లో దిల్లీతో తలపడింది. అయితే, ఆ జట్టు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 159/7 పరుగులే చేసింది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమంగా మారి ఫలితం సూపర్ ఓవర్కు వెళ్లింది. అక్కడ దిల్లీ విజయం సాధించింది. అంతకుముందు చివరి ఓవర్లో సన్రైజర్స్కు 16 పరుగులు అవసరం కాగా కేన్ విలియమ్సన్(66*), జగదీశ సుచిత్(14*) ధాటిగా ఆడి 15 పరుగులు చేశారు. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా ఒకే పరుగు సాధించారు. దీంతో సూపర్ ఓవర్లో ఒత్తిడికిలోనై ఈ మ్యాచ్ను కూడా కోల్పోయారు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.