IPL 2021: కోల్కతాతో ఓటమిపాలయ్యాక.. పంత్, పృథ్వీ కంటతడి!
కోల్కతా నైట్ రైడర్స్తో క్వాలిఫయర్-2లో ఓటమిపాలైన సందర్భంగా దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీషా కంటతడి పెట్టారు...
(Photo: Prithvi Shaw Instagram)
ఇంటర్నెట్డెస్క్: కోల్కతా నైట్ రైడర్స్తో క్వాలిఫయర్-2లో ఓటమిపాలైన సందర్భంగా దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీషా కంటతడి పెట్టారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత ఓవర్లలో 135/5 స్వల్ప స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో కోల్కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (55), శుభ్మన్ గిల్ (46) ధాటిగా ఆడి తొలి వికెట్కు 96 పరుగులు జోడించారు. దీంతో ఆ జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఈ క్రమంలోనే కోల్కతా సునాయాస విజయం సాధిస్తుందని ఆశించినా చివరి నాలుగు ఓవర్లలో దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్పై పట్టు సాధించింది. ఏకంగా మ్యాచ్ గెలించేంత పని ప్రత్యర్థికి చెమటలు పట్టించింది.
కోల్కతా విజయానికి 24 బంతుల్లో 13 పరుగులు అవసరమైన వేళ దిల్లీ పేసర్లు అవేశ్ ఖాన్, నార్జే, రబాడ కట్టుదిట్టంగా బంతులేశారు. 17, 18, 19 ఓవర్లలో బౌలింగ్ చేసి ఆరు పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశారు. దీంతో ఒక్కసారిగా దిల్లీ పోటీలోకి వచ్చి ఆ శిబిరంలో ఆశలు నింపింది. ఆఖరి ఓవర్లో కోల్కతా విజయానికి 7 పరుగులు అవసరమైన వేళ అశ్విన్ బౌలింగ్ చేసి తొలి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి షకిబ్ (0), నరైన్ (0)ను ఔట్ చేశాడు. ఇక కోల్కతా విజయానికి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన వేళ దిల్లీ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. అలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లోనే రాహుల్ త్రిపాఠి (12) సిక్సర్ బాది తమ జట్టును గెలిపించాడు. దీంతో ఈసారైన కప్పు గెలవాలని అనుకున్న దిల్లీ క్యాపిటల్స్ కల చెదిరింది.
ఈ నేపథ్యంలోనే పృథ్వీ, పంత్ ఓటమిపాలయ్యాక కంటతడి పెట్టారు. పృథ్వీ మైదానంలోనే కిందపడి భావోద్వేగం చెందాడు. తోటి ఆటగాళ్లు అతడిని పైకి లేపి డ్రెస్సింగ్ రూమ్క తీసుకెళ్లారు. మరోవైపు కెప్టెన్ పంత్ కూడా బాధతో కనిపించాడు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మరోవైపు కోల్కతా అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఓటమిటంచుల దాకా వెళ్లి చివరికి సంచలన విజయం సాధించడంపై నెటిజెన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. రాహుల్ను మెచ్చుకుంటూనే చివరి నాలుగు ఓవర్లలో ఆ జట్టు బ్యాటింగ్ తీరును ఇలా 0, 1 ,1, W, 0, 0, 0, 0, 0, 0, 1, W, 2, 0, 1, 0, 0, W, 1, 0, W, W, SIX! ఉందంటూ సరదాగా స్పందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..