IPL 2021: కోల్కతా ముందే ఆడటం వల్ల మాకు కలిసి వస్తుంది : రోహిత్ శర్మ
ఐపీఎల్ 14వ సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్కు మూడు జట్లు చేరుకున్నాయి. ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం కోల్కతా, ముంబయి జట్లు ప్రధానంగా పోటీపడుతున్నాయి...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్కు మూడు జట్లు చేరుకున్నాయి. ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం కోల్కతా, ముంబయి జట్లు ప్రధానంగా పోటీపడుతున్నాయి. మరోవైపు రాజస్థాన్, పంజాబ్ సాంకేతికంగా ఇంకా పోటీలో ఉన్నా.. అవి ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమే. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్కు చేరుకోవు. అయితే, ముంబయి టీమ్ లీగ్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్తో చివరి మ్యాచ్లో ఆడటం వల్ల ప్లేఆఫ్స్కు చేరాలంటే.. మ్యాచ్కు ముందే తమకు ఏం చేయాలనే విషయంపై స్పష్టత వస్తుందని ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
గత మ్యాచ్లో రాజస్థాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ముంబయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నెట్ రన్రేట్ -0.048గా నమోదైంది. మరోవైపు కోల్కతా 12 పాయింట్లతోనే ఉన్నా మెరుగైన రన్రేట్ +0.294 కారణంగా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండింటిలో ఒకటి కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కోల్కతా ఈ రోజు రాజస్థాన్తో తన చివరి మ్యాచ్లో తలపడనుండగా ఇక్కడ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుండాలని భావిస్తోంది. అదే సమయంలో ముంబయి తన చివరి మ్యాచ్లో సన్రైజర్స్తో ఓడితే మోర్గాన్ టీమ్ నాలుగో స్థానం ఖరారైనట్లే. ఒకవేళ రాజస్థాన్ చేతిలో ఓడితే.. అప్పుడు ముంబయి తన చివరి మ్యాచ్లో సన్రైజర్స్పై విజయం సాధిస్తే సరిపోతుంది. అలా కాకుండా రాజస్థాన్పై కోల్కతా గెలిస్తే మాత్రం.. అప్పుడు ముంబయి సన్రైజర్స్పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో వర్చువల్గా మాట్లాడిన రోహిత్.. లీగ్ దశలో తాము చివరి మ్యాచ్ సన్రైజర్స్తో ఆడటం వల్ల తమకు కలిసి వస్తుందని చెప్పాడు. ‘ఐపీఎల్లో ప్రతి జట్టూ మిగిలిన అన్ని జట్లను ఓడించే సత్తా ఉన్నవే. అయితే, లీగ్ దశలో కోల్కతా మా కన్నా ముందే రాజస్థాన్తో తన చివరి మ్యాచ్లో తలపడుతుండటంతో.. మేం సన్రైజర్స్తో ఎలా ఆడితే ప్లేఆఫ్స్ చేరుతామనే విషయం ముందుగానే స్పష్టమవుతుంది’ అని వివరించాడు. అలాగే రాజస్థాన్పై గత మ్యాచ్లో విజయం సాధించడంపైనా మాట్లాడుతూ.. ఇంతకుముందు మ్యాచ్లో తాము రెండు పాయింట్లు సాధించి రన్రేట్ను మెరుగుపర్చుకోవాల్సి ఉండగా దాన్ని పూర్తి చేశామని వెల్లడించాడు. ఆ మ్యాచ్ తమకు తిరిగి పుంజుకునే అవకాశం కల్పించిందని రోహిత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు