IPL 2021: ఇక్కడ కష్టమని తెలుసు.. ఈ పిచ్ వైవిధ్యంగా ఉంటుంది
ఐపీఎల్ 14వ సీజన్లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమి చవిచూసింది. శనివారం దిల్లీతో తలపడిన సందర్భంగా ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమి చవిచూసింది. శనివారం దిల్లీతో తలపడిన సందర్భంగా ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 129/8 తక్కువ స్కోరుకే పరిమితమవ్వగా.. దిల్లీ 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పిచ్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు ఏమన్నారంటే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాం: రోహిత్
‘ఇదో కష్టతరమైన వేదిక అని ముందే తెలుసు. షార్జా వేదికగా జరిగిన ఎన్నో మ్యాచ్లు చూశాం. ఇక్కడ మనకు కావాల్సినన్ని పరుగులు వచ్చే అవకాశం ఉండదని అర్థం చేసుకున్నాం. అందుకు సిద్ధపడే బరిలోకి దిగాం. దీంతో బ్యాటింగ్ చేసేటప్పుడు ఎలా ఆడాలనే విషయాలపైనా చర్చించుకున్నాం. అయినా ఆడలేకపోయాం. సరైన భాగస్వామ్యాలు నిర్మించలేకపోయాం. ఈ వికెట్పై 170-180 పరుగులు సాధిస్తామనే ఆలోచనలు లేవు. 140 అయితే ఫర్వాలేదనుకున్నాం. బ్యాట్స్మెన్ సరైన పరుగులు చేయలేకపోతే నిలకడగా విజయాలు సాధించడం కష్టం. ఈ సీజన్లో మేం సరిగ్గా బ్యాటింగ్ చేయడం లేదని ఒప్పుకొంటా. అయితే, నేను బ్యాట్స్మెన్ను నిందించడం లేదు. జట్టుగా బాగా సన్నద్ధమవుతున్నాం. కానీ, మధ్యలో విఫలమవుతున్నాం. అదే మమ్మల్ని నిరాశకు గురిచేస్తోంది. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాం. ఇక మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని రోహిత్ అన్నాడు.
ఇది వైవిధ్యమైన పిచ్: పంత్
‘షార్జాలో ఎప్పుడు ఆడినా ఇతర పిచ్ల కన్నా వైవిధ్యంగా ఉంటుందని తెలుసు. దీంతో ఇది కష్టంగా సాధించిన విజయమే అనుకుంటాం. అయితే, ఈ మ్యాచ్లో మేం పవర్ప్లేలో పూర్తిగా పేస్ బౌలింగే వేయించాలనుకున్నాం. ఎందుకంటే తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించాం. ఈ క్రమంలోనే పొలార్డ్, హార్దిక్ బ్యాటింగ్ చేసేటప్పుడు అశ్విన్కు చివర్లో ఒక ఓవర్ మిగిలి ఉంచాలని అనుకున్నా. వాళ్లని ఆఖర్లో కట్టడి చేయాలని ప్రణాళిక వేసుకున్నాం. ఇక ఈ సీజన్లో మాకు దొరికిన ఆణిముత్యం అవేశ్ ఖాన్. అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ కీలక వికెట్లు తీస్తున్నాడు. జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. ఇకపోతే ఛేదనలో నేనూ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసేటప్పుడు చివరి వరకూ క్రీజులో ఉండాలనుకున్నాం. కానీ, నేను ఔటైన విధానం నిరాశకు గురిచేసింది. ఆ షాట్ నేను అనుకున్నట్లు వెళ్లలేదు. ఇవన్నీ ఆటలో భాగం. ఎవరైనా ఒక బ్యాట్స్మెన్ పవర్ప్లేలో దంచికొట్టాలి. ఈరోజు నేను ఆ బాధ్యత తీసుకోవాలనుకున్నా’ అని పంత్ పేర్కొన్నాడు.
అందుకు తగ్గట్టే సిద్ధమయ్యా: శ్రేయస్
ఇక మ్యాచ్లో జట్టును విజయతీరాలకు చేర్చిన శ్రేయస్ అయ్యర్(33*) దిల్లీని గెలిపించడం అద్భుతంగా ఉందన్నాడు. ఇది తక్కువ స్కోర్ కలిగిన మ్యాచ్ కాబట్టి చివరి వరకు క్రీజులో నిలవాలనుకున్నట్లు చెప్పాడు. ‘నా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరిగినా అందుకు తగ్గట్టు సిద్ధమయ్యా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జట్టును గెలిపిస్తాననే నమ్మకం ఉంది. మనం సానుకూలంగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. ఈ క్రమంలోనే అశ్విన్ కూడా అదే ఆలోచనా విధానంతో బాగా ఆడాడు. సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. మేమిద్దరం ఆఖరివరకు క్రీజులో నిలవాలని అనుకున్నాం. అందుకు నాకు పూర్తిగా సహకరించాడు. మరోవైపు మా జట్టు గత రెండేళ్లలో చాలా మారిపోయింది. 2019 నుంచి జట్టులోని పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారాయి. లీగ్ దశలో ప్రతి పాయింట్ కూడా ముఖ్యమే. ఎందుకంటే టాప్ రెండు జట్లలో నిలిస్తే ప్లేఆఫ్స్లో ఒకటి గెలవగానే నేరుగా ఫైనల్స్ చేరే అవకాశం ఉంటుంది. అందుకోసమే లీగ్ స్టేజ్లో ప్రతి మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని శ్రేయస్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ