T20 World Cup: పాకిస్థాన్ టీ20 జట్టులో షోయబ్ మాలిక్.. సంతోషంలో అఫ్రిది
పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను మళ్లీ టీ20 ప్రపంచకప్ జట్టులో చూడటం బాగుందని ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిది సంబరపడ్డాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీకి ముందు పాక్ జట్టులో...
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను మళ్లీ టీ20 ప్రపంచకప్ జట్టులో చూడటం బాగుందని ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిది సంబరపడ్డాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీకి ముందు పాక్ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్మన్ షోయబ్ మక్సూద్ గాయంతో తప్పుకోవడంతో 39 ఏళ్ల మాలిక్ను తుది జట్టులో ఎంపిక చేశారు. కాగా, అతడికిది ఆరో టీ20 ప్రపంచకప్ కావడం విశేషం. ఈ క్రమంలోనే అఫ్రిది తాజాగా రెండు ట్వీట్లు చేస్తూ.. మాలిక్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుతో కలిసి ఉండటం మంచిదని అన్నాడు. తన సీనియారిటీతో జట్టును ముందుండి నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘టీ20 ప్రపంచకప్ టోర్నీకి వెళ్లే ఆటగాళ్లందరి కోసం నేను మనసారా ప్రార్థిస్తున్నా. నా మద్దతు మీకెప్పుడూ ఉంటుంది. మీరు బాగా ఆడి జట్టును విజేతగా నిలపండి. మమ్మల్ని అందర్నీ గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నా’ అని అఫ్రిది ట్వీట్ చేశాడు. కాగా, మాలిక్ 2007లో అరంగేట్రం టీ20 ప్రపంచకప్ నుంచీ ఆ జట్టుతో కొనసాగుతున్నాడు. తొలి టోర్నీలోనే పాకిస్థాన్కు సారథ్యం వహించి జట్టును ఫైనల్కు చేర్చాడు. ఆపై 2009లో పాక్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2010 టోర్నీలో ఆడలేకపోయిన అతడు గత మూడు టోర్నీల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే మరోసారి టీ20 ప్రపంచకప్లో ఆడబోతున్నాడు. ఇక ఈనెల 24న పాకిస్థాన్ భారత్తో తొలి మ్యాచ్లో తలపడనున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి