IPL 2021: మా ఆటగాళ్లముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదు: మోర్గాన్
ఐపీఎల్ 14వ సీజన్లోని తొలి దశలో ఐదు ఓటములతో వెనుకంజలో పడిన కోల్కతా నైట్ రైడర్స్ సోమవారం బెంగళూరుపై రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. గతరాత్రి జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించి కోహ్లీసేనను చిత్తుగా ఓడించింది...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లోని తొలి దశలో ఐదు ఓటములతో వెనుకంజలో పడిన కోల్కతా నైట్ రైడర్స్ సోమవారం బెంగళూరుపై రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. గతరాత్రి జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించి కోహ్లీసేనను చిత్తుగా ఓడించింది. దీంతో ఆ జట్టులో కొత్త ఆశలు చిగురించాయి. మ్యాచ్ అనంతరం కెప్టెన్ మోర్గాన్ మాట్లాడుతూ తమ జట్టులోని ఆటగాళ్ల ముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదని ప్రశంసించాడు. ‘మా జట్టులో ఉన్న ఆటగాళ్ల నైపుణ్యాలతో పోలిస్తే కొన్నిసార్లు ఏదీ సరితూగదు. మా టైమింగ్ కూడా బాగా కుదిరింది. ఏ ఆటగాడైనా బరిలోకి దిగి తమ సత్తా చూపించాలి. ఈరోజు మా బౌలర్లు బాగా రాణించారు. మాక్స్వెల్, ఏబీ, విరాట్.. లాంటి మేటి బ్యాట్స్మెన్ను కట్టడి చేసి వారిపై ఆధిపత్యం చలాయించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ టోర్నీలో మేమింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మేం ముందుకు సాగాలంటే చాలా విషయాలు కలిసిరావాలి. కానీ, రెండో దశలో ఈరోజు మంచి ఆరంభం దక్కింది. ఈ ప్రదర్శనతో మేం ప్రమాదకర జట్టుగా ఎదిగే అవకాశం ఉంది’ అని మోర్గాన్ పేర్కొన్నాడు.
ఇక ఈ మ్యాచ్లో 48 పరుగులతో అదరగొట్టిన శుభ్మన్గిల్ మాట్లాడుతూ.. తాము తిరిగి పోటీలోకి రావాలనుకున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే అన్ని విభాగాల్లో సత్తాచాటి బెంగళూరును ఓడించామన్నాడు. ఇలాగే విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్కు చేరతామనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసి ఓపెనర్గా అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్(41*) బ్యాటింగ్ను మెచ్చుకున్నాడు. మరోవైపు బౌలింగ్లో అత్యద్భుత ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తిని కూడా గిల్ ప్రశంసించాడు.
హ్యాట్రిక్ సాధించాననుకున్నా.. కానీ
ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేయగా త్రుటిలో హ్యాట్రిక్ వికెట్ల ఘనత చేజార్చుకున్నాడు. నాలుగో బంతికి మ్యాక్స్వెల్ (10)ను బౌల్డ్ చేసిన అతడు తర్వాతి బంతికే హసరంగ(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక మరుసటి బంతికే జేమీసన్ను కూడా ఎల్బీగా ఔట్ చేసినట్లే కనిపించినా ఆ బంతి బ్యాట్ అంచు తాకడంతో బతికిపోయాడు. దీంతో వరుణ్ మంచి అవకాశాన్ని కోల్పోయాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘పిచ్ నుంచి మరీ అంత టర్నింగ్ లేదు. దాంతో వికెట్లకేసి బౌలింగ్ చేశా. 12వ ఓవర్లో ఆరో బంతికి జేమీసన్ను కూడా ఔట్ చేశానని మొదట భావించాను. దాంతో హ్యట్రిక్ దక్కుతుందని ఆశపడ్డా. కానీ.. రీప్లేలో అది నాటౌట్గా తేలడంతో హ్యాట్రిక్ మిస్సయింది’ అని వివరించాడు. మరోవైపు తాను చాలా ఆలస్యంగా కెరీర్ ప్రారంభించానని, ఇప్పుడిప్పుడే టీమ్ఇండియాలో అవకాశాలు వస్తున్నాయని వరుణ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్