IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్కు అగ్ని పరీక్షే!
ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ముంబయి ఇండియన్స్ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ధోనీసేనకు ప్రత్యేక గుర్తింపు ఉంది...
దిల్లీతో తొలి క్వాలిఫయర్
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ముంబయి ఇండియన్స్ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ధోనీసేనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, గతేడాది పేలవ ఆటతీరుతో కనీసం ప్లేఆఫ్స్ చేరకుండా ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇంటిముఖం పట్టిన ఆ జట్టు ఈసారి విజృంభించి ఆడింది. దిల్లీతో సమానంగా విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్ బెర్తునూ ముందే ఖరారు చేసుకుంది. కానీ, ఇప్పుడు వరుసగా మూడు ఓటములు చవిచూసి అనూహ్యంగా కంగుతింది. ఆదివారం దిల్లీతో క్వాలిఫయర్ 1లో తలపడుతున్న నేపథ్యంలో ధోనీసేన ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామా..
ఆ ఓటములకు కారణాలేంటి?
చెన్నై గురువారం రాత్రి తన చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్తో తలపడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 134/6 స్కోరే చేసింది. డుప్లెసిస్ (76; 55బంతుల్లో 8x4, 2x6) ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్మెన్ తేలిపోయారు. ఛేదనలో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (98*; 42 బంతుల్లో 7x4, 8x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడు ఒంటి చేత్తో మ్యాచ్ను 13 ఓవర్లలోనే పూర్తి చేశాడు. దీంతో ఈ పిచ్ పెద్ద ప్రమాదకరమేమీ కాదని తెలుస్తోంది. బ్యాట్స్మెన్ వైఫల్యమే చెన్నై ఓటమికి ప్రధాన కారణమని స్పష్టంగా అర్థమవుతోంది.
అంతకుముందు దిల్లీ క్యాపిటల్స్తోనూ ఇదే మైదానంలో చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి 136/5 స్వల్ప స్కోరే నమోదు చేసింది. ఈసారి అంబటి రాయుడు (55*; 43 బంతుల్లో 5x4, 2x6) ఆదుకున్నాడు. అనంతరం దిల్లీ సైతం ఛేదనలో తడబాటుకు గురైంది. 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇక ఈ మ్యాచ్కు ముందు అబుదాబి వేదికగా రాజస్థాన్తో జరిగిన పోరులోనూ చెన్నై ఓటమిపాలైంది. రుతురాజ్ గైక్వాడ్ (101; 60 బంతుల్లో 9x4, 5x6) సూపర్ సెంచరీతో చెలరేగడంతో పాటు ఇతరులు సైతం బ్యాట్లకు పనిచెప్పారు. దీంతో 189 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే, రాజస్థాన్ ఛేదనలో సునాయాసంగా గెలిచి ధోనీసేనకు షాకిచ్చింది. 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. శివమ్ దూబె(64; 42 బంతుల్లో 4x4, 4x6), యశస్వి జైశ్వాల్ (50; 21 బంతుల్లో 6x4, 3x6) దంచికొట్టారు. దీన్ని బట్టి చెన్నై బౌలింగ్ ఎలా ఉందనేది అర్థమవుతోంది.
హైదరాబాద్తో మ్యాచ్లోనూ..
ఈ మూడు ఓటములకు ముందు సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లోనూ ధోనీసేన 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కష్టపడింది. రుతురాజ్ (45; 38 బంతుల్లో 4x4, 2x6), డుప్లెసిస్ (41; 36 బంతుల్లో 3x4, 2x6) మెరిశారు. చివరలో రాయుడు (17*), ధోనీ (14*) పలు బౌండరీలు బాదడంతో 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ అంశాలన్నీ లెక్కలోకి తీసుకుంటే చెన్నై టీమ్ అనుకున్నంత బలంగా కనిపించడంలేదు.
దిల్లీతో గెలిస్తే ఓకే.. లేదంటే..!
ఇక ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్లో ఎవరెవరు ఏయే జట్లతో తలపడనున్నారో ఖరారైంది. దిల్లీ, చెన్నై పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. బెంగళూరు, కోల్కతా జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. దీంతో ఆదివారం తొలి క్వాలిఫయర్లో దిల్లీ, చెన్నై పోటీపడనున్నాయి. చెన్నై ఇక్కడ గెలిస్తే నేరుగా ఫైనల్ చేరనుంది. ఒకవేళ ఓడినా రెండో క్వాలిఫయర్లో అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పటికే వరుసగా మూడు ఓటములతో సతమతమవుతున్న ధోనీసేన ప్రస్తుతం పూర్తి బలంగా ఉన్న దిల్లీని ఓడించడం అంత తేలిక కాదు. ఇక అప్పుడు కూడా ఓటమిపాలైతే రెండో క్వాలిఫయర్లో పుంజుకోవడం కష్టమనే చెప్పాలి. ఏదేమైనా ఆదివారం ధోనీసేన గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?