IPL 2021: నాలుగో బెర్తు.. నలుగురిలో ఎవరికో?

ఐపీఎల్‌-14లో ఎనిమిదేసి విజయాలు సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే. 10 మ్యాచ్‌లాడి 6 విజయాలు సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా ప్లేఆఫ్స్‌కు చేరువలోనే ఉంది...

Updated : 28 Sep 2021 08:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌-14లో ఎనిమిదేసి విజయాలు సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే. 10 మ్యాచ్‌లాడి 6 విజయాలు సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా ప్లేఆఫ్స్‌కు చేరువలోనే ఉంది. మిగతా 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ఆ జట్టు ముందంజ వేస్తుంది. ఒకటి నెగ్గినా దానికి అవకాశముంటుంది. ఇక నాలుగో బెర్తు కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. ముంబయి, పంజాబ్‌, రాజస్థాన్‌, కోల్‌కతా.. ఈ నాలుగు జట్లూ 10 మ్యాచ్‌ల్లో  నాలుగేసి విజయాలతో సమాన స్థితిలో ఉన్నాయి. ఐపీఎల్‌-14 రెండో అంచెను బాగానే ఆరంభించినప్పటికీ.. తమ చివరి మ్యాచ్‌ల్లో కోల్‌కతా, రాజస్థాన్‌ ఓటమి పాలై ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి. మరి ఈ నాలుగు జట్లలో నిలకడగా ఆడి ప్లేఆఫ్స్‌ బెర్తు సాధించే జట్టేదో చూడాలి. సన్‌రైజర్స్‌ సోమవారం రాజస్థాన్‌పై నెగ్గినా.. ఇప్పటికే 8 మ్యాచ్‌ల్లో ఓడటంతో ప్లేఆఫ్‌ రేసుకు దూరమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని