Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంకొంత కాలం వేచి చూడాల్సింది: పఠాన్
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్గా వైదొలగాలనే నిర్ణయం తీసుకోవాల్సింది కాదని, ఈ విషయం గురించి జట్టు యాజమాన్యంతో చర్చించి ఉండాలని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్గా వైదొలగాలనే నిర్ణయం తీసుకోవాల్సింది కాదని, ఈ విషయం గురించి జట్టు యాజమాన్యంతో చర్చించి ఉండాలని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అతడు మరికొంత కాలం వేచి చూడాల్సిందని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలనే విషయాన్ని తాను ఒప్పుకోనని, ఒక్కడే మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించాలని సూచించాడు.
మరోవైపు ఇద్దరు కెప్టెన్ల పద్ధతి మనది కాదని, దాన్ని విదేశీ జట్లు పాటిస్తాయని మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు. టీమ్ఇండియాకు ఒక్క సారథి ఉంటేనే ఉపయోగకరమని తెలిపాడు. సరిగ్గా ప్రపంచకప్ టోర్నీకి ముందు కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. అయితే, ఒక ఆటగాడిగా అనేక విషయాలు బుర్రలో తిరుగుతాయని చెప్పాడు. అలాంటప్పుడే ఏం చేయాలనేదానిపై స్నేహితులు, కుటుంబసభ్యులు, కోచ్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఇర్ఫాన్ సూచించాడు.
కాగా, కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా ఆలోచించి ఉంటాడని కూడా మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. అయితే, అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా ఈసారి ప్రపంచకప్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. కోహ్లీ మరికొన్ని రోజులు టీ20 కెప్టెన్గా కొనసాగి ఉంటే అతడి నాయకత్వం ప్రతిభ ఏంటో ప్రపంచానికి తెలియజేసేవాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే విరాట్ ఇంకొంత కాలం వేచి చూడాల్సిందని మాజీ పేసర్ విచారం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు