Bumrah vs Anderson: బుమ్రా సారీ.. బూతులు తిట్టిన అండర్సన్.. అందుకే కోహ్లీసేనలో ఆ ఫైర్!
లార్డ్స్ టెస్టులో టీమ్ఇండియా ఎప్పుడూ లేనంత కసిగా ఎందుకు ఆడింది? ఆంగ్లేయులు కవ్విస్తుంటే భారత ఆటగాళ్లు ఎందుకంత ఘాటుగా స్పందించారు...
లార్డ్స్ టెస్టులో టీమ్ఇండియా ఎప్పుడూ లేనంత కసిగా ఎందుకు ఆడింది? ఆంగ్లేయులు కవ్విస్తుంటే భారత ఆటగాళ్లు ఎందుకంత ఘాటుగా స్పందించారు? ఆట ఆఖరి రోజు బౌలర్లు ఎందుకంత పట్టుదల ప్రదర్శించారు? కనీసం ముఖంలో నవ్వుతున్న ఛాయలు ఎందుకు కనిపించనివ్వలేదు?
...ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా క్షమాపణలు నిరాకరించిన అండర్సన్ అతడిని పక్కకు తోసేయడమే కారణమట.
తొలి ఇన్నింగ్స్లో అండర్సన్కు బౌన్సర్లు సంధించిన జస్ప్రీత్ బుమ్రా అతడికి క్షమాపణ చెప్పాడట. కానీ, అతడి క్షమాపణను పట్టించుకోని జిమ్మీ.. పేసుగుర్రాన్ని పక్కకు తోసేసి బూతు మాటలు అన్నాడట. ఆ మాటలే టీమ్ఇండియా క్రికెటర్లలో అగ్నిజ్వాలను రగిలించాయని ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తెలిపారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో ఆయన ఈ విషయాలను వివరించారు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో ఆఖరి బ్యాట్స్మన్గా జిమ్మీ అండర్సన్ వచ్చాడు. అప్పటికే ఆధిక్యం కోల్పోయిన టీమ్ఇండియా త్వరగా వికెట్లు తీయాల్సిన పరిస్థితి. దాంతో జస్ప్రీత్ బుమ్రా అతడికి 90 మైళ్ల వేగంతో బంతులు వేశాడు. షార్ట్పిచ్ బంతులు సంధించడంతో అవి అండర్సన్కు తగిలాయి.
అప్పుడు ‘బుమ్రా! ఇంత వేగంగా ఎందుకు వేస్తున్నావు? నీకు నేనిలాగే వేశానా? ఇప్పటి వరకు నువ్వు 80 మైళ్ల వేగంతో వేశావు. నన్ను చూడగానే 90 మైళ్ల వేగంతో ఎందుకు విసురుతున్నావు’ అని జిమ్మీ అన్నట్టు శ్రీధర్ తెలిపారు. కాగా, అండర్సన్ అలా మాట్లాడటం తనకు విస్మయం కలిగించిందని అశ్విన్ పేర్కొన్నాడు.
‘ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగియగానే కుర్రాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చేశారు. ఆ తర్వాత బుమ్రా వేగంగా వెళ్లి జిమ్మీ భుజం తట్టాడు. ఉద్దేశపూర్వకంగా బంతులు వేయలేదని వివరించాలన్నది అతడి ఉద్దేశం. బుమ్రా ఎంత మంచి వ్యక్తో మనందరికీ తెలుసు. అందుకే, ఆ వ్యవహారం అంతటితో ముగించేందుకు అతడి వద్దకు వెళ్లాడు. కానీ అండర్సన్ బుమ్రాను పక్కకు తోసేశాడు’ అని శ్రీధర్ వివరించారు.
‘అంతేకాదు, ఇతర బ్యాట్స్మెన్కు నువ్వు 85మైళ్ల వేగంతో బంతులేశావు. నాకేమో 90 మైళ్లతో వేశావు. ఇది మోసం. నేను అంగీకరించను అని అండర్సన్ చెప్పాడు. ఇదంతా జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చింది. అంతకు ముందు అలా లేదని కాదు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిలో జ్వాలను రగిలించింది. దాని ప్రభావం ఐదోరోజు మైదానంలో కనిపించింది’ అని శ్రీధర్ తెలిపారు.
ఆయన మరో అరుదైన సంగతీ చెప్పారు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అనధికార ఫాస్ట్ బౌలర్ల క్లబ్ ఉండేదట. బౌలర్లకు వేగంగా బంతులు వేయొద్దన్న నియమం పెట్టుకున్నారట. కాలం మారే కొద్దీ ఆ క్లబ్ ఆనవాళ్లు లేకుండా పోయిందని శ్రీధర్ చెప్పారు. ఇప్పుడెవరూ దానిని పట్టించుకోవడం లేదని, వేగంగా బంతులు విసురుతున్నారని వివరించారు.
టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ ఔటవ్వగానే 180 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ను ఇబ్బంది పెట్టొచ్చని కోచ్ రవిశాస్త్రి తనకు చెప్పారని శ్రీధర్ తెలిపారు. సాధారణంగా వారమంతా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే శాస్త్రి ఆ రోజు ఉదయమే భోజనం చేసి ఆత్రుతగా కూర్చుకున్నారట. ఇక బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అయితే విపరీతంగా బాధపడిపోయారట. ‘ఐదు రోజులు ఎంతో కష్టపడి బంతులు విసిరాను. బౌలర్లు కనీసం 30 పరుగులైనా చేయకుంటే ఎలా? శ్రీ (శ్రీధర్) నువ్వూ విసిరావు కదా’ అని ఆవేదన చెందాడట. కానీ బుమ్రా, షమి అద్భుతం చేయడంతో ఆనందంలో తేలిపోయాడట. వారు డ్రెస్సింగ్ రూమ్లోకి తిరిగొచ్చేటప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా చప్పట్లు కొట్టాలని విరాట్ కోహ్లీ జట్టు సభ్యులను ఆదేశించినట్లు శ్రీధర్ వివరించారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో