వీడెవడండీ బాబూ! టీమ్ఇండియా 12వ ఆటగాడిగా మారిపోయాడు!!
ఒకవైపు భారత్, ఇంగ్లాండ్ మ్యాచులు ఉత్కంఠ రేపుతోంటే.. మరోవైపు ఓ ప్రాంక్స్టర్ మాత్రం అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాడు! భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నాడు! ఇంకా చెప్పాలంటే క్రికెటర్ల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాడు...
లీడ్స్: ఒకవైపు భారత్, ఇంగ్లాండ్ మ్యాచులు ఉత్కంఠ రేపుతోంటే.. మరోవైపు ఓ ప్రాంక్స్టర్ మాత్రం అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాడు! భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నాడు! ఇంకా చెప్పాలంటే క్రికెటర్ల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాడు!!
లార్డ్స్లో రెండో టెస్టు ఆడుతుంటే ఓ అనూహ్య ఘటన చోటు చేసుకున్న సంఘటన గుర్తుందా? నాలుగో రోజు రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. అదే సమయంలో టీమ్ఇండియా జెర్సీకిట్ ధరించిన ఓ వ్యక్తి మైదానంలో అడుగుపెట్టాడు. సాధారణ ఫీల్డర్లా ప్రవర్తించాడు. అక్కడికి వెళ్లు.. దూరంగా నిలబడు.. అంటూ సైగలు చేసి ఫీల్డింగ్ సెట్చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ నిజంగానే అతడిని ఆటగాడిగా భావించారు.
నిజం తెలిసిన అభిమానులు మాత్రం స్టాండ్స్లో ముసిముసిగా నవ్వుకున్నారు. చివరికి అతడు ప్రాంక్స్టర్ అని తెలియడంతో జడ్డూ, సిరాజ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక మైదానం సిబ్బంది అతడిని బయటకు తీసుకువెళ్లడానికి ఆపసోపాలు పడ్డారు.
మూడో టెస్టులోనూ ఆ వ్యక్తి మళ్లీ మైదానంలోకి రావడం కలకలం సృష్టించింది. ‘జర్వో 69’ అనే పేరుతో టీమ్ఇండియా జెర్సీని ధరించి అతడు మైదానంలోకి వచ్చాడు. మూడో రోజు ఆటలో రోహిత్శర్మ ఔటైనప్పుడు అతడు బ్యాటు పట్టుకొని, హెల్మెట్ ధరించి మైదానంలోకి నడిచాడు. ఐతే అతడి ముఖానికి సర్జికల్ మాస్క్ ఉండటంతో గుర్తించిన సిబ్బంది వెంటనే అతడిని బయటకు తీసుకెళ్లారు. కాగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అతడు మైదానంలోకి ఎలా అడుగు పెడుతున్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!