T20 World Cup: ధోని డ్రెస్సింగ్ రూమ్లో ఉంటే..
ధోని ఉంటే డ్రెస్సింగ్రూమ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని కేఎల్ రాహుల్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో కఠిన పోరాటాలకు సిద్ధమవుతున్న టీమ్ఇండియాకు ధోనీకి మించిన మెంటార్ ఉండడని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్లో రాహుల్.. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్
దుబాయ్: ధోని ఉంటే డ్రెస్సింగ్రూమ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని కేఎల్ రాహుల్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో కఠిన పోరాటాలకు సిద్ధమవుతున్న టీమ్ఇండియాకు ధోనీకి మించిన మెంటార్ ఉండడని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్లో రాహుల్.. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్న సంగతి తెలిసిందే. భారత్ తన తొలి మ్యాచ్లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఢీకొంటుంది. ‘‘ధోని తిరిగి జట్టుతో కలిసినందుకు సంతోషంగా ఉంది. మేం అతడి నాయకత్వంలో ఆడాం. కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా మేం అతణ్ని మెంటార్గానే చూశాం’’ అని రాహుల్ చెప్పాడు. ‘‘కెప్టెన్గా ఉన్నప్పుడు డ్రెస్సింగ్రూమ్లో ధోని ప్రశాంత స్వభావం మాకు ఎంతో నచ్చేది. అతణ్ని ఎంతో గౌరవించేవాళ్లం. ఇప్పుడు అతడు మళ్లీ మాతో కలిసినందుకు గొప్పగా అనిపిస్తోంది. అతడు ఉండడం వల్ల ఒకరకమైన ప్రశాంతత వస్తుంది. గత కొన్ని రోజులుగా అతడి సమయాన్ని వెచ్చించడాన్ని ఆస్వాదిస్తున్నా. చాలా సరదాగా గడిచిపోతోంది. రానున్న రోజుల్లో ధోని బుర్రను పూర్తిగా ఉపయోగించుకుంటా’’ అని అన్నాడు. ఐపీఎల్ 2021 ఫైనల్.. ధోని చివరి ఐపీఎల్ మ్యాచ్ అని తామెవరమూ అనుకోవట్లేదని రాహుల్ తెలిపాడు. 40 ఏళ్లు దాటినా.. బలంగా ఉన్న కుర్రాళ్ల కంటే కూడా ఎక్కువ దూరం అతడు సిక్స్ కొట్టగలడని చెప్పాడు. ధోని చాలా బలంగా, ఫిట్గా ఉన్నాడని రాహుల్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు