Liander Paes - Mahesh Bhupathi:వింబుల్డన్ గెలవాలని ఉందా!
వింబుల్డన్ గెలవాలని ఉందా..? 16 ఏళ్ల లియాండర్ పేస్.. తన సహచరుడైన 15 ఏళ్ల మహేశ్ భూపతికి వేసిన ప్రశ్న ఇది..! అయితే ఈ కల నెరవేరుతుందని...
ముంబయి: వింబుల్డన్ గెలవాలని ఉందా..? 16 ఏళ్ల లియాండర్ పేస్.. తన సహచరుడైన 15 ఏళ్ల మహేశ్ భూపతికి వేసిన ప్రశ్న ఇది..! అయితే ఈ కల నెరవేరుతుందని.. తమ జోడీ టెన్నిస్లో ప్రపంచ నంబర్వన్గా నిలుస్తుందని భూపతి ఊహించలేదు! కానీ పేస్తో అతడి భాగస్వామ్యం అద్భుతాలు చేసింది.. వింబుల్డన్ మాత్రమే కాదు ఎన్నో టోర్నీల్లో భారత్కు విజయాలను అందించింది. ప్రపంచ అత్యుత్తమ జోడీగా వీరిద్దరి ప్రయాణం ‘బ్రేక్ పాయింట్’ అనే సిరీస్గా రాబోతోంది. మహేశ్ భూపతికి తనకు మధ్య ఉన్న సోదరభావం వల్లే కలిసికట్టుగా ఆడి ఎన్నో విజయాలు సాధించగలిగామని..తమ ప్రస్థానాన్ని ఈ సిరీస్లో చూడొచ్చని పేస్ అన్నాడు. ‘‘భూపతి, నేను ఆటగాళ్లుగా సోదరభావాన్ని సృష్టించుకున్నాం. యువకులుగా ఉన్నప్పుడే జోడీగా మారి.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని గెలవడం.. ఆపై ప్రపంచ నంబర్వన్ జంటగా నిలవడం లాంటి అంశాలను ‘బ్రేక్ పాయింట్’ సిరీస్లో మీరు చూడబోతున్నారు. కెరీర్ ఆసాంతం దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంత ప్రతిష్టాత్మకంగా భావించామో ప్రేక్షకులు ఈ సిరీస్లో చూస్తారు. నేను 16 ఏళ్ల కుర్రాడిగా.. భూపతి 15 ఏళ్ల టీనేజర్గా ఉన్నప్పుడు శ్రీలంకలో ఆసియా ఛాంపియన్షిప్ ఆడిన సందర్భంలో ‘వింబుల్డన్ గెలవాలని ఉందా’ అని భూపతిని అడిగాను. అతడు నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత మేం జోడీ కట్టడం.. వరుస విజయాలు సాధించడం చరిత్ర. ఈ సిరీస్ మా కెరీర్లోని ఎత్తు పల్లాలను చూపిస్తుంది’’ అని పేస్ చెప్పాడు. ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’గా పేరుబడిన పేస్-భూపతి జంట... 1994 నుంచి 2006 వరకు అప్రతిహత విజయాలతో దూసుకెళ్లింది. వింబుల్డన్తో పాటు 1999, 2001 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలిచింది. 2006లో అభిప్రాయ బేధాలతో విడిపోయిన ఈ జంట 2008-2011లో మళ్లీ కలిసింది. ఆ తర్వాత దూరమైన ఈ జోడీ మళ్లీ కలవలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!