Mohammed Shami: ఈ మాత్రం దానికే దిగులెందుకు? ఇంకా టైం ఉందని షమి భరోసా
మూడో టెస్టులో పేలవ ప్రదర్శన తమపై ఎలాంటి ప్రభావం చూపించలేదని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమి అన్నాడు. కొన్నిసార్లు సుదీర్ఘ ఫార్మాట్లో చెడ్డ రోజులు ఎదురవుతాయని తెలిపాడు....
లీడ్స్: మూడో టెస్టులో పేలవ ప్రదర్శన తమపై ఎలాంటి ప్రభావం చూపించలేదని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమి అన్నాడు. కొన్నిసార్లు సుదీర్ఘ ఫార్మాట్లో చెడ్డ రోజులు ఎదురవుతాయని తెలిపాడు. ఐదు టెస్టుల సిరీసులో ఇంకా సమయం మిగిలే ఉంది.. ఆటగాళ్లు దిగులు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
‘లేదు, మిత్రమా! ప్రస్తుత ప్రదర్శన మాపై మానసికంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదు. మేం మూడు రోజుల్లో మ్యాచులు ముగించాం. కొన్ని సార్లైతే రెండు రోజుల్లోనే ముగించేశాం. కొన్నిసార్లు చెడ్డ రోజులు ఎదురవుతాయి. టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సుల్లో త్వరగా ఆలౌటై ఎక్కువసేపు ఫీల్డింగ్ చేశాం’ అని షమి అన్నాడు.
‘కొన్నిసార్లు ఇలా అవుతుంది. అంత మాత్రానికే ఆత్మస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా సిరీసులో రెండు టెస్టులు మిగిలే ఉన్నాయి’ అని షమి తెలిపాడు. ‘మేం సిరీసులో 1-0తో ఆధిక్యంలో ఉన్నాం. అందుకే ప్రతికూలంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మా నైపుణ్యాలను విశ్వసించి, మాకు మేం అండగా ఉండాలి’ అని పేర్కొన్నాడు.
ప్రత్యర్థి జట్టులో భారీ భాగస్వామ్యాలు నమోదవుతుంటే వాటిని విడదీయాల్సిన బాధ్యత బౌలర్ల మీదే ఉంటుందని షమి అన్నాడు. వికెట్లు తీసేందుకు, బ్యాట్స్మెన్ను బురిడీ కొట్టించేందుకు మనసులోనే వ్యూహాలు రచించాల్సి ఉంటుందన్నాడు.
తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 78 పరుగులకే కుప్పకూలగా ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి 423/8తో నిలిచింది. ఆ జట్టు కెప్టెన్ జోరూట్ (121) వరుసగా మూడో శతకం సాధించాడు. భారత్లో షమి (3/87), జడ్డూ (2/88), బుమ్రా (1/58), సిరాజ్ (2/86) వికెట్లు తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!