Mary Kom: బౌట్కు ఒక్క నిమిషం ముందు.. డ్రెస్ మార్చుకోమన్నారు!
ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత మేరీకోమ్ అనూహ్య రీతిలో టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన 51 కిలోల
జడ్జిమెంట్పై మేరీకోమ్ అసంతృప్తి
దిల్లీ: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత మేరీకోమ్ అనూహ్య రీతిలో టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన 51 కిలోల ప్రీక్వార్టర్స్లో 2-3తో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇంగ్రిట్ వాలెన్సియా (కొలంబియా) చేతిలో ఓడింది. అయితే బౌట్ ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించినా.. న్యాయనిర్ణేతల స్ప్లిట్ డిసిషన్తో మేరీకి పరాజయం తప్పలేదు. దీంతో జడ్జీల తీరుపై మేరీకోమ్ అసంతృప్తి చెందింది. అంతేగాక, బౌట్కు ఒక్క నిమిషం ముందు తనను డ్రెస్ మార్చుకోమని అడగడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
పోటీ అనంతరం మేరీకోమ్ ఓ ట్వీట్ చేసింది. ‘‘ఆశ్చర్యకరంగా ఉంది.. అసలు రింగ్ డ్రెస్ అంటే ఏంటీ? నా ప్రీక్వార్టర్ బౌట్కు ఒక్క నిమిషం ముందు నన్ను రింగ్ డ్రెస్ మార్చుకుని రమ్మని చెప్పారు. అలా ఎందుకు అడిగారో చెబుతారా?’’ అని ఆమె ప్రశ్నించింది.
ఓడిపోయానంటే నమ్మలేకపోతున్నా..
ప్రీ క్వార్టర్స్లో తాను మూడింట రెండు రౌండ్లు గెలిచినప్పటికీ జడ్జీలు ప్రతికూల నిర్ణయం ప్రకటించడంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) బాక్సింగ్ టాస్క్ ఫోర్స్పై మేరీకోమ్ విమర్శలు చేసింది. ‘‘న్యాయనిర్ణేతల నిర్ణయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. టాస్క్ఫోర్స్, ఐఓసీకి ఏమైంది?’’ అని పీటీఐకి ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేసింది. ఓడిపోయానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ ఆవేదన చెందింది.
‘‘టాస్క్ఫోర్స్లో నేను కూడా సభ్యురాలినే. పారదర్శకంగా పోటీలు జరిగేందుకు నేను కూడా సలహాలు ఇస్తుంటా. కానీ ఈ రోజు ఏం జరిగింది? నేను రింగ్లో ఎంతో సంతోషంగా ఉన్నాను. కచ్చితంగా నేను గెలిచానని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే బయటకు వచ్చాను. ఆ తర్వాత నన్ను డోపింగ్కు తీసుకెళ్లారు. అప్పుడు కూడా ఆనందంగానే ఉన్నాను. కానీ నా కోచ్ చెప్పేదాకా నేను ఓడిపోయాననే విషయం నాకు తెలియలేదు. ఇదే ప్రత్యర్థిని గతంలో రెండు సార్లు ఓడించాను. కానీ రిఫరీ ఆమె(వాలెన్సియా) చేతిని ఎత్తడం ఇంకా నమ్మలేకపోతున్నా’’ అని మేరీ చెప్పుకొచ్చింది. ‘‘రెండో రౌండ్లో నేను ఏకగ్రీవంగా గెలవాల్సింది. కానీ న్యాయనిర్ణేతల నుంచి 3-2 ఫలితం వచ్చింది. అంతా అనూహ్యంగా జరిగిపోయింది. ఒక్క క్షణంలో అథ్లెట్ భవిష్యత్తే మారుతుంది. ఈ రోజు జరిగిందంతా దురదృష్టకరం. న్యాయనిర్ణేతల ఫలితంతో నేను అసంతృప్తి చెందాను. అయితే మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ రివ్యూ అడగడానికి, ఆందోళన చేయడానికి అవకాశం ఉండదు. కానీ జరిగిందాన్ని ప్రపంచం అంతా చూస్తోంది’’ అని మేరీ ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే ఇక్కడితో తన కెరీర్ ముగిసిందని భావించట్లేదని మేరీ తెలిపింది. బాక్సింగ్ను ఎప్పటికీ విడిచిపెట్టేది లేదని, ఒలింపిక్స్ నుంచి తిరిగొచ్చాక కొద్ది రోజులు కుటుంబంతో గడిపి.. తర్వాతి పోటీలకు సాధన మొదలుపెడతానని చెప్పింది. 38ఏళ్ల మేరీకోమ్కు ఇదే చివరి ఒలింపిక్స్ కావడం గమనార్హం. 40ఏళ్ల పైబడిన బాక్సర్లు ఒలింపిక్కు అర్హులు కారని ప్రస్తుతం నిబంధన ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?