IND vs ENG: ఐపీఎల్ కోసమే ఆటగాళ్లు భయపడ్డారు: మైఖేల్ వాన్
ఇంగ్లాండ్తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దవ్వడంపై ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించాడు. ఈ టెస్టు ద్వారా కరోనా సోకితే తర్వాత ఐపీఎల్ ఆడలేమనే భయంతోనే ఇలా జరిగిందని చెప్పాడు...
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దవ్వడంపై ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించాడు. ఈ టెస్టు ద్వారా కరోనా సోకితే తర్వాత ఐపీఎల్ ఆడలేమనే భయంతోనే ఇలా జరిగిందని చెప్పాడు. వాన్ ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
నిజం చెప్పాలంటే ఇదంతా డబ్బు, ఐపీఎల్ కోసమే జరిగిందని, ఈ ఐదో టెస్టు రద్దవ్వడానికి.. ఆటగాళ్లు కరోనా బారిన పడితే ఐపీఎల్ ఆడలేమని భావించారని వాన్ పేర్కొన్నాడు. మరో వారం పది రోజుల్లో మనం ఐపీఎల్ చూస్తుంటాం. అక్కడ ఆటగాళ్లంతా సంతోషంగా తిరుగుతూ కనిపిస్తారు. కానీ, వాళ్ల ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నమ్మాల్సింది. ఇప్పుడు కరోనా వైరస్ గురించి మనకంతా తెలిసింది. దాన్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో తెలిసొచ్చింది. మరోవైపు క్రికెటర్లంతా డబుల్ వాక్సిన్ తీసుకున్నారు. దాంతో పాటు పటిష్టమైన బయోసెక్యూరిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది’ అని వాన్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
అలాగే ఐదో టెస్టు రద్దవ్వడానికి గల కారణాలు కూడా నమ్మశక్యంగా లేవని ఇంగ్లాండ్ మాజీ సారథి సందేహం వెలిబుచ్చాడు. టెస్టు క్రికెట్లో ఇదో ముఖ్యమైన మ్యాచ్ అని, సిరీస్ అద్భుతంగా సాగిందని వాన్ చెప్పుకొచ్చాడు. ఆట ప్రారంభానికి కాస్త ముందే రద్దవ్వడం నమ్మశక్యంగా లేదన్నాడు. మరోవైపు ఈ విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఐదో టెస్టు రద్దవ్వడానికి ఐపీఎల్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఇక ఈ సిరీస్లో భారత్ 2-1 తేడాతో ముందంజలో నిలిచింది. చివరి టెస్టు కూడా జరిగి కోహ్లీసేన విజయం సాధించి ఉంటే భారత్ సరికొత్త చరిత్ర సృష్టించేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?