Mirabai Chanu: మీరాబాయి చాను చెవి‘రింగుల’ కథ తెలుసా?
ఒలింపిక్స్లో మహిళల వెయిట్ లిఫ్టింగ్లో చరిత్రాత్మక విజయం సాధించి క్రీడా సంబరంలో భారత్కు తొలి పతకం అందించింది మీరాబాయి చాను. అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేరుస్తూ.. సగర్వంగా రజత
ఒలింపిక్స్ కోసం అమ్మ ఇచ్చిన ‘అదృష్టపు పోగులు’ అవి..
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో మహిళల వెయిట్ లిఫ్టింగ్లో చరిత్రాత్మక విజయం సాధించి క్రీడా సంబరంలో భారత్కు తొలి పతకం అందించింది మీరాబాయి చాను. అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేరుస్తూ.. సగర్వంగా రజత పతకాన్ని మెడలో వేసుకుంది. ఆ సమయంలో ఆమె కళ్లల్లో మెరిసిన ఆనందంతో పాటు మరో విశేషం కూడా చూపరులను ఆకట్టుకుంది. అది మరేంటో కాదు.. చాను చెవిరింగులు. అచ్చంగా ఒలింపిక్ రింగులను పోలిన ఆ చెవిపోగుల వెనుక పెద్ద కథే ఉంది. బిడ్డ కోసం ఓ అమ్మ పడిన శ్రమ, చేసిన త్యాగానికి నిదర్శనం ఈ దుద్దులు.
అది 2016.. రియో ఒలింపిక్స్ కోసం చాను తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ సమయంలో ఆమె తల్లి సైఖోమ్ ఓంగ్బీ టాంబీ లైమా చానుకు ఓ అందమైన బహుమతినిచ్చారు. అవే ఒలింపిక్ రింగుల్లాంటి ఈ చెవుదుద్దులు. రియో ఒలింపిక్స్లో కూతురు పతకం సాధించాలన్న కోరికతో లైమా.. తన బంగారాన్ని అమ్మి, అప్పటిదాకా కూడబెట్టిన సొమ్ము కలిపి ఈ చెవిపోగులను ప్రత్యేకంగా చేయించారు. ఈ రింగులతో తన బిడ్డకు అదృష్టం, విజయం వరించాలని ఆమె కోరుకున్నారు. అయితే ఆ ఒలింపిక్స్లో చానుకు ఆ అదృష్టం వరించలేదు గానీ.. నేటి టోక్యో ఒలింపిక్స్లో గెలుపు ఆమె సొంతమైంది. ఆ అమ్మ త్యాగానికి ఇప్పుడు ఫలితం లభించింది.
శనివారం జరిగిన పోటీల్లో 49కేజీల విభాగంలో చాను రెండో స్థానంలో నిలిచి ఒలింపిక్స్లో తొలి పతకాన్ని అందుకుంది. ఆ అపురూప క్షణాలను టీవీలో చూసుకుంటూ చాను మాతృమూర్తి సంతోషంతో ఉప్పొంగిపోయారు. టీవీలో ఆ చెవిరింగులు కన్పించగానే ఆనందభాష్పాలు కార్చారు. ‘‘ఈ ఒలింపిక్స్లో కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని, లేదంటే కనీసం పతకం అయినా సొంతం చేసుకుంటానని చాను గట్టిగా చెప్పింది. ఆ ఆనంద క్షణాల కోసం మేం ఎంతగానో ఎదురుచూశాం. చాను విజయాన్ని చూసేందుకు మా బంధువులు, మిత్రులు నిన్నే మా ఇంటికి వచ్చారు. అంతా కలిసి బయట టీవీ పెట్టుకుని చూశాం. మా అమ్మాయి గెలవగానే మేమంతా సంతోషంలో మునిగిపోయాం. మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది’’ అని లైమా ఆనందంగా చెప్పుకొచ్చారు.
అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుని..
పోటీ ప్రారంభానికి ముందు చాను తన ఇంటికి వీడియో కాల్ చేసింది. ‘‘దేశం కోసం పతకం సాధించేలా నన్ను ఆశీర్వదించండి’’ అని అమ్మానాన్నను కోరింది. వారి ఆశీర్వాదం, ఎంతో మంది ప్రోత్సాహంతో చాను ఈ రోజు ఈ ఘనత సాధించింది అని ఆమె బంధువులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు