Mohammad Rizwan: టీ20ల్లో సరికొత్త రికార్డు.. ఒకే ఏడాదిలో 2 వేల పరుగులు
పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (2,036) టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 2 వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు...
కరాచి: పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (2,036) టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 2 వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. కరాచి వేదికగా గురువారం రాత్రి వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో ఆ జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో విండీస్ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలోనే ఒషానే థామస్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రిజ్వాన్ తొలి బంతిని బౌండరీకి తరలించి టీ20ల్లో ఈ ఏడాది 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఇక పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ సైతం ఇదే ఏడాది (1,779) పరుగులు సాధించి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. విండీస్ బ్యాట్స్మన్ క్రిస్గేల్ 2015లో.. (1,665) పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016లో.. (1,614) పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక భారీ ఛేదనలో పాక్ ఓపెనర్లు రిజ్వాన్ (87; 45 బంతుల్లో 10x4, 3x6), బాబర్ (79; 53 బంతుల్లో 9x4, 2x6) అర్ధశతకాలతో చెలరేగారు. దీంతో టీ20ల్లో మరో అత్యుత్తమ రికార్డు నెలకొల్పారు. వీళ్లిద్దరూ పొట్టి ఫార్మాట్లో ఆరోసారి శతక భాగస్వామ్యాలు జోడించారు. టీమ్ఇండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఐదుసార్లు ఈ ఘనత సాధించి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM