Dhoni: చెన్నైలోనే ధోని వీడ్కోలు మ్యాచ్!
ధోని అభిమానులకు శుభవార్త. ఈ దిగ్గజ ఆటగాడు మరో ఐపీఎల్ సీజన్ ఆడబోతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహి.. ఈ ఏడాది టోర్నీతోనే ముగిస్తాడా అన్న అనుమానాలకు
చెన్నై: ధోని అభిమానులకు శుభవార్త. ఈ దిగ్గజ ఆటగాడు మరో ఐపీఎల్ సీజన్ ఆడబోతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహి.. ఈ ఏడాది టోర్నీతోనే ముగిస్తాడా అన్న అనుమానాలకు తెరదించుతూ వచ్చే సీజన్లో తనను చూస్తారని.. తన వీడ్కోలు మ్యాచ్ ప్రియతమ చెన్నై స్టేడియంలోనే ఉంటుందని అతడు స్పష్టం చేశాడు. మంగళవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో అభిమానులతో మాట్లాడుతూ అతడిలా అన్నాడు. ‘‘వీడ్కోలు మాటకు వచ్చేసరికి అది చెన్నైలోనే ఉంటుంది. ఘనంగా నన్ను సాగనంపేందుకు మీకు ఓ అవకాశం లభిస్తుంది. వచ్చే సీజన్లో చెన్నై వచ్చి నా చివరి మ్యాచ్లో అభిమానులను కలుసుకుంటానని ఆశిస్తున్నా’’ అని ధోని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పడానికి ‘ఆగస్టు 15’ను మించిన రోజు మరొకటి తనకు కనిపించలేదని.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మహి సమాధానంగా చెప్పాడు. వచ్చే ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై జట్టు ధోనితో పాటు రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్లను తిరిగి దక్కించుకోనున్నట్లు తెలిసింది. 2020, 2021 ఐపీఎల్ సీజన్లు యూఏఈలోనే జరగడంతో 2019 నుంచి మహి మళ్లీ చెన్నైలోకి ఆడలేదు. ఈ ఏడాది టోర్నీ తొలి అంచెలో చెన్నై జట్టు ముంబయి కేంద్రంగానే మ్యాచ్లు ఆడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్