MS Dhoni: కర్ణశర్మ, దీపక్ చాహర్కు ఫుట్బాల్ పోటీ పెట్టిన ఎంఎస్ ధోనీ.. గెలిచిందెవరంటే?
చెన్నై సూపర్కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి ఫుట్బాల్ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు! క్రికెట్ మ్యాచులకు సిద్ధమయ్యే ముందు అతడు ఫుట్బాల్ ఆడుతుంటాడు...
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి ఫుట్బాల్ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు! క్రికెట్ మ్యాచులకు సిద్ధమయ్యే ముందు అతడు ఫుట్బాల్ ఆడుతుంటాడు. ఏటా బాలీవుడ్ తారలతో కలిసి ఓ ధార్మిక మ్యాచులోనూ మెరుస్తుంటాడు.
ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న క్రికెటర్లు మినహా ప్రస్తుతం సీఎస్కే బృందమంతా యూఏఈలోనే ఉంది. క్వారంటైన్ పూర్తవ్వడంతో ఐపీఎల్ రెండో దశకు సిద్ధమవుతోంది. ఆటగాళ్లు రోజూ కసరత్తులు చేస్తున్నారు. నెట్స్లో విపరీతంగా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా మైదానంలో సరదాగా గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎంఎస్ ధోనీ శుక్రవారం రాత్రి ఫుట్బాల్ ఆర్కెస్ట్రేటర్గా మారాడు. స్పిన్నర్ కర్ణ్శర్మ, పేసర్ దీపక్ చాహర్ మధ్య ‘2 టచెస్ 7 పాయింట్స్’ ఫుట్బాల్ పోటీ నిర్వహించాడు. ఆటకు సంబంధించిన నియమాలను వారికి వివరించాడు. పోటీలో మొదట వరుస పాయింట్లు సాధించి తర్వాత వెనకబడ్డ కర్ణశర్మకు సలహాలు సైతం ఇవ్వడం గమనార్హం. ఈ పోటీకి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్కింగ్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.