MS Dhoni: కర్ణశర్మ, దీపక్‌ చాహర్‌కు ఫుట్‌బాల్‌ పోటీ పెట్టిన ఎంఎస్‌ ధోనీ.. గెలిచిందెవరంటే?

చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీకి ఫుట్‌బాల్‌ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు! క్రికెట్‌ మ్యాచులకు సిద్ధమయ్యే ముందు అతడు ఫుట్‌బాల్‌ ఆడుతుంటాడు...

Published : 29 Aug 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీకి ఫుట్‌బాల్‌ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు! క్రికెట్‌ మ్యాచులకు సిద్ధమయ్యే ముందు అతడు ఫుట్‌బాల్‌ ఆడుతుంటాడు. ఏటా బాలీవుడ్‌ తారలతో కలిసి ఓ ధార్మిక మ్యాచులోనూ మెరుస్తుంటాడు.

ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న క్రికెటర్లు మినహా ప్రస్తుతం సీఎస్‌కే బృందమంతా యూఏఈలోనే ఉంది. క్వారంటైన్‌ పూర్తవ్వడంతో ఐపీఎల్‌ రెండో దశకు సిద్ధమవుతోంది. ఆటగాళ్లు రోజూ కసరత్తులు చేస్తున్నారు. నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా మైదానంలో సరదాగా గడుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎంఎస్‌ ధోనీ శుక్రవారం రాత్రి ఫుట్‌బాల్‌ ఆర్కెస్ట్రేటర్‌గా మారాడు. స్పిన్నర్‌ కర్ణ్‌శర్మ, పేసర్‌ దీపక్‌ చాహర్‌ మధ్య ‘2 టచెస్‌ 7 పాయింట్స్‌’ ఫుట్‌బాల్‌ పోటీ నిర్వహించాడు. ఆటకు సంబంధించిన నియమాలను వారికి వివరించాడు. పోటీలో మొదట వరుస పాయింట్లు సాధించి తర్వాత వెనకబడ్డ కర్ణశర్మకు సలహాలు సైతం ఇవ్వడం గమనార్హం.  ఈ పోటీకి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని