Shikhar Dhawan: ధావన్.. లక్ష్మణ్ మోడల్ అనుసరించాలి: ఎమ్మెస్కే
టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి టీ20 క్రికెట్లో చోటు దక్కించుకోవాలంటే మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ తీరును అనుసరించాలని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి టీ20 క్రికెట్లో చోటు దక్కించుకోవాలంటే మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఆట తీరును అనుసరించాలని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సూచించారు. తాజాగా ప్రసాద్ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వీవీఎస్ను టీమ్ఇండియా పక్కనపెట్టిన ప్రతిసారీ దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించేవాడని, దాంతో సెలెక్టర్లు అతడిని తీసుకునేవారని ఆయన వివరించారు.
‘ధావన్ తిరిగి టీ20 జట్టులో ఆడాలంటే లక్ష్మణ్ ఆటతీరునే అనుసరించాలి. వీవీఎస్ను జట్టు నుంచి తొలగించినప్పుడల్లా వందల కొద్దీ పరుగులు సాధించి తిరిగి చోటు సాధించేవాడు. ఇప్పుడు ధావన్ కూడా అలాగే చేయాలి. అతడి వయసు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇకపై ఏ ఫార్మాట్ ఆడినా పరుగులు చేస్తానని నిరూపించుకోవాలి. అలా చేస్తే.. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా జట్టులోకి వస్తాడు. అలాగే తన బ్యాటింగ్ టెక్నిక్లోనూ ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డారు. కాగా, ధావన్ ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టీమ్ఇండియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, అతడిని రాబోయే టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.