Virat Kohli: కోహ్లీ త్వరలోనే ఇంతకుముందులా రాణిస్తాడు: నాజర్
టీమ్ఇండియా దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్ కన్నా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీనే అత్యంత ఉత్సాహభరితమైన క్రికెటర్ అని పాకిస్థాన్ మాజీ ఆటగాడు ముడాస్సర్...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్ కన్నా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీనే ఎంతో ధైర్యంగా ముందుకుసాగే క్రికెటర్ అని పాకిస్థాన్ మాజీ ఆటగాడు ముదస్సర్ నాజర్ ప్రశంసించాడు. కోహ్లీ త్వరలోనే ఇంతకుముందులా ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కొంతకాలంగా టీమ్ఇండియా సారథి అర్ధశతకాలు బాదుతున్నా వాటిని శతకాలుగా మల్చడంలో విఫలమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముదస్సర్ నాజర్ ఓ జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘సంవత్సరాల పాటు నిలకడగా పరుగులు చేయడమే కోహ్లీ, గావస్కర్ మధ్య ఉన్న ఒకే విధమైన పోలిక. అందువల్లే విరాట్ను చాలా మంది అభిమానిస్తారు. అయితే, కోహ్లీ కొద్ది రోజులుగా నిలకడగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఏళ్ల కొద్దీ ఆడే ఆటగాళ్లలో ఇలా జరగడం సహజమే. మనుషులుగా మనమూ కొన్నిసార్లు మానసికంగా సరిగ్గా ఉండలేం. అలాంటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడే కోచ్ సహాయం అవసరం అవుతుంది. ఇప్పుడు విరాట్ కూడా చాలా ఏళ్లుగా నిరంతరాయంగా ఆడటం వల్ల ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇన్నాళ్లూ టీమ్ఇండియా, ఆర్సీబీకి కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు కెప్టెన్సీ వదులుకుంటుండటంతో త్వరలోనే పరుగులు చేసి రాణిస్తాడని అనుకుంటున్నా’ అని నాజర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్