Neeraj chopra: బల్లెం వీరుడు నీరజ్ను ఏమైనా అడుగుతారా? సా. 4 గం.కు ఛాన్స్!
బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కోలుకున్నాడు. తిరిగి అభిమానులతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యాడు....
ఇంటర్నెట్ డెస్క్: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కోలుకున్నాడు. తిరిగి అభిమానులతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యాడు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్లైన్ వేదికగా అందరితో మాట్లాడతానని వెల్లడించాడు. ఫేస్బుక్ ద్వారా అభిమానులను కలుసుకుంటానని ప్రకటించాడు.
టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం ముద్దాడిన భారత రెండో అథ్లెట్గా నిలిచాడు. అంతేకాకుండా వందేళ్ల తర్వాత దేశానికి అథ్లెటిక్స్లో పతకం అందించాడు. విశ్వక్రీడల్లో ఈటెను ఎవరికీ అందనంత దూరం విసిరి స్వర్ణపతకం సాధించాడు.
టోక్యో నుంచి స్వదేశానికి వచ్చిన నీరజ్ చోప్రాకు భారతీయులు ఘన స్వాగతం పలికారు. అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. వరుసగా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రముఖులను అతడు సందర్శించాడు. సన్మాన కార్యక్రమాలు, రహదారి షోల్లో పాల్గొన్నాడు. హఠాత్తుగా అతడికి జ్వరం రావడంతో ఓ రోడ్షో నుంచి మధ్యలోనే తప్పుకొని ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం కోలుకోవడంతో ఫేస్బుక్ ద్వారా అభిమానులతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యాడు. వారు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.