PAK vs NZ : ఇమ్రాన్ హామీ ఇచ్చినా పాక్కు షాకిచ్చిన కివీస్!
పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆఖరి నిమిషంలో టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంది. భద్రతా కారణాల రిత్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది...
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆఖరి నిమిషంలో టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంది. భద్రతా కారణాల రీత్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆటగాళ్ల భద్రతే తమకు అన్నింటికన్నా ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్లను తిరిగి న్యూజిలాండ్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ వెల్లడించారు.
పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు శుక్రవారం నుంచి మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే, ఈ రోజు మధ్యాహ్నం రావల్పిండిలో ప్రారంభమవ్వాల్సిన తొలి వన్డే నిర్ణీత సమయానికి మొదలవ్వలేదు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలతో ఈ పర్యటనను విరమించుకుంటున్నట్లు న్యూజిలాండ్ వెల్లడించింది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు పెద్ద షాకే అయినా ఆటగాళ్ల భద్రతే తమకు ప్రాముఖ్యమని తేల్చిచెప్పింది.
మరోవైపు ఈ విషయంపై స్పందించిన పీసీబీ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని ఓ ప్రకటనలో తెలిపింది. తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆటగాళ్ల భద్రతపై న్యూజిలాండ్ ప్రధానితో మాట్లాడినా వాళ్లు ఇలా ఉన్నపళంగా టోర్నీని రద్దు చేసుకుంటున్నారని తెలిపింది. ఇప్పటికీ తాము షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించింది.
న్యూజిలాండ్ నిర్ణయం పట్ల పలువురు క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘న్యూజిలాండ్.. పాకిస్థాన్ క్రికెట్ను చంపేసింది. రావల్పిండి నుంచి బాధాకరమైన వార్త వినాల్సి వచ్చింది’ అని ట్వీట్ చేశాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కూడా న్యూజిలాండ్ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తంచేశాడు. ‘న్యూజిలాండ్ అర్దాంతరంగా సిరీస్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం బాధాకరం. ఈ వార్తతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. మా భద్రతా సంస్థల శక్తి సామర్ధ్యాలపై నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. వారు మా దేశానికి గర్వకారణం. మమ్మల్ని వారెప్పుడూ కాపాడుతూనే ఉంటారు. పాకిస్థాన్ జిందాబాద్’ అని ట్వీట్ చేశాడు. వీరితో పాటు పాక్ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ ఇదే రీతిలో స్పందించారు. భద్రతా కారణాలతో టోర్నీ రద్దు చేసుకోవడం వల్ల ఆ దేశంలో జరిగే భవిష్యత్ పర్యటనలపైనా ప్రభావం పడుతుందని భారత్కు చెందిన వ్యాఖ్యాత హర్షాభోగ్లే, మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్