Kohli - Rohit: ‘క్రీడల కంటే ఎవరూ గొప్పవారు కాదు.. ’
టీమ్ ఇండియా జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. క్రీడలే అత్యుత్తమమైనవని.. వాటి కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆయన స్పష్టం చేశారు.
విరాట్-రోహిత్’ వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి
దిల్లీ: టీమ్ ఇండియా జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. క్రీడలే అత్యుత్తమమైనవని.. వాటి కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆయన స్పష్టం చేశారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ ఆడకపోవడం, మరోవైపు రోహిత్ శర్మ టెస్టు సిరీస్కు దూరంగా ఉండటం లాంటివి.. జట్టులో విభేదాలు ఉన్నాయనే విషయాన్ని బహిర్గతం చేస్తాయని టీమ్ ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ నిన్న ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎవరైనా విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదని, కానీ.. తీసుకునే సందర్భం సరైనదిగా ఉండాలని అజహర్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రిని మీడియా కోరింది.
‘క్రీడలే అత్యుత్తమమైనవి. వాటి కంటే ఎవరూ గొప్పవారు కాదు. ఏ ఆటలో, ఏ ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతుందో నేను మీకు సమాచారం ఇవ్వలేను. ఇది ఆ ఆటలకు సంబంధించిన సంఘాలు చేయాల్సిన పని. వారు సమాచారం ఇస్తే బాగుంటుంది’ అని అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు.
మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్ శర్మ ఇప్పటికే గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కోహ్లీ వ్యక్తిగత కారణాల రీత్యా వన్డే సిరీస్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై బీసీసీఐ స్పందించింది. తనకు విశ్రాంతి కావాలని కోహ్లీ తమకు అధికారికంగా ఎలాంటి విన్నపం చేయలేదని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.