Tokyo Paralympics: టేబుల్‌ టెన్నిస్‌... ఓటమితో మొదలు

పారాలింపిక్స్‌లో భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారులు ఓటమితో తమ ప్రస్థానం ఆరంభించారు. ప్యాడ్లర్లు భావినాబెన్‌ పటేల్‌, సోనాల్‌బెన్‌ మనుభాయి పటేల్‌ తొలి రౌండ్లలో ఓటమి పాలయ్యారు...

Published : 25 Aug 2021 13:13 IST

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారులు ఓటమితో తమ ప్రస్థానం ఆరంభించారు. ప్యాడ్లర్లు భావినాబెన్‌ పటేల్‌, సోనాల్‌బెన్‌ మనుభాయి పటేల్‌ తొలి రౌండ్లలో ఓటమి పాలయ్యారు.

మహిళల క్లాస్‌-3 విభాగంలో పోటీపడ్డ సోనాల్‌బెన్‌ మొదటి మూడు గేముల్లో ఆధిపత్యం చలాయించింది. కానీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక పోయింది. 11-9, 3-11, 17-15, 7-11, 4-11 తేడాతో చైనా క్రీడాకారిణి లీ క్వాన్‌ చేతిలో ఓటమి పాలైంది. లీ ప్రపంచ నాలుగో ర్యాంకరే కాకుండా రియోలో రజత పతక విజేత కావడం గమనార్హం.

ఇక మహిళల క్లాస్-4 విభాగం తొలి పోరులో భావినాబెన్‌కు సైతం చైనా అమ్మాయి చేతిలోనే ఓటమి ఎదురైంది. ప్రపంచ నంబర్‌ వన్‌, జౌయింగ్‌ చేతిలో 3-11, 9-11, 2-11 తేడాతో ఓటమి పాలైంది. క్లాస్‌-3తో పోలిస్తే క్లాస్‌-4 విభాగంలో వైకల్యం శాతం ఎక్కువ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని