Tokyo Olympics: భవానీ దేవికి అండగా మోదీ.. గెలుపోటములు సహజమేనని ఓదార్పు!

భారత ఏకైక ఫెన్సర్‌ భవానీ దేవికి ప్రధాని నరేంద్రమోదీ అండగా నిలిచారు. ఒలింపిక్స్‌లో ఆమె ప్రదర్శన అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. శక్తిమేరకు పోరాడావని పేర్కొన్నారు. గెలుపోటములు క్రీడల్లో భాగమేనని వెన్నుతట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు....

Published : 27 Jul 2021 10:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ఏకైక ఫెన్సర్‌ భవానీ దేవికి ప్రధాని నరేంద్రమోదీ అండగా నిలిచారు. ఒలింపిక్స్‌లో ఆమె ప్రదర్శన అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. శక్తిమేరకు పోరాడావంటూ అభినందించారు. గెలుపోటములు క్రీడల్లో భాగమేనని వెన్నుతట్టారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు.

భవానీదేవి అరంగేట్రం ఒలింపిక్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. తొలిరౌండ్లో నడియా అజిజిపై 15-3 తేడాతో గెలిచింది. అయితే, రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ మేనన్‌ బ్రూనెట్‌ చేతిలో 7-15 తేడాతో ఓటమి పాలైంది. ఒలింపిక్స్‌ ఫెన్సింగ్‌లో ఒక మ్యాచ్‌ గెలిచిన తొలి భారతీయురాలిగా గర్వపడుతున్నానని ఆమె తెలిపింది. అలాగే రెండో రౌండ్లో ఓడిపోయినందుకు క్షమాపణలు తెలియజేసింది. ఆమె ట్వీటుకు మోదీ స్పందించారు.

‘మీ అత్యుత్తమ సామర్థ్యం మేరకు పోరాడారు. మాకదే ముఖ్యం. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. మీ సేవలకు భారత్‌ గర్విస్తోంది. మన దేశ పౌరులందరికీ మీరు స్ఫూర్తిగా ఉండిపోతారు’ అని ప్రధాని మోదీ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని