సచిన్ నుంచే ఆ లక్షణం నేర్చుకున్నా: పసిడి పతక విజేత ప్రమోద్ భగత్
ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే లక్షణం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నుంచి అలవర్చుకున్నానని టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పసిడి పతక విజేత ప్రమోద్ భగత్ తెలిపాడు...
(Photo: Pramod Bhagat Twitter)
ఇంటర్నెట్డెస్క్: ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే లక్షణం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నుంచి అలవర్చుకున్నానని టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పసిడి పతక విజేత ప్రమోద్ భగత్ తెలిపాడు. తాను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, అప్పటి నుంచే టీవీలో సచిన్ ఆటను చూసేవాడినని అన్నాడు. దాంతో తనకు కూడా అతడిలా ప్రశాంతంగా ఉండే లక్షణం అలవడిందని పేర్కొన్నాడు. మైదానంలో సచిన్ ఒత్తిడి జయిస్తూ ప్రశాంతంగా ఆడేవాడని గుర్తుచేశాడు.
‘నేను చిన్నప్పటి నుంచే సచిన్ను ఫాలో అయ్యేవాడిని. అతడి ప్రవర్తన నన్ను అమితంగా ఆకట్టుకుంది. నేను కూడా అలాంటి ఆలోచనా విధానంతోనే ఆడేవాడిని. అలా ప్రశాంతంగా ఉంటూ ఆటపై శ్రద్ధ పెట్టడం నాకెంతో ఉపయోగపడింది. ఎన్నో మ్యాచ్ల్లో వెనుకపడిపోయాక తిరిగి పుంజుకోవడంలోనూ బాగా కలిసివచ్చింది. పారాలింపిక్స్ ఫైనల్స్లో నేను 4-12 తేడాతో వెనుకంజలో ఉన్నప్పుడు కూడా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నా. ప్రశాంతంగా ఆడితే మళ్లీ పుంజుకొని విజయం సాధిస్తానని భావించా’ అని భగత్ చెప్పుకొచ్చాడు.
ఇక పారాలింపిక్స్లో పసిడిపతకం సాధించిన అనంతరం సచిన్ను కలిశానని, దాంతో తన ఆరాధ్య క్రికెటర్ను కలవాలనే కోరిక నెరవేరిందని ప్రమోద్ పేర్కొన్నాడు. జీవితాన్ని, క్రీడలను ఎలా సమన్వయం చేసుకోవాలో సచిన్ తనకు చెప్పారని గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన టీ షర్టు బహుమతిగా ఇచ్చాడని తెలిపాడు. ఇక 2005లో తాను బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించినప్పుడు ఈ ఆటకు భవిష్యత్ లేదని భావించానని చెప్పాడు. అనంతరం 2009లో ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచానని, ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ పారా బ్యాడ్మింటన్ను గుర్తించాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు తాను పసిడి పతకం సాధిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని ఆశించినట్లు తెలిపాడు. అయితే, తాను ఊహించినదానికన్నా మంచి గుర్తింపు లభించిందని ప్రమోద్ సంతోషం వ్యక్తంచేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..