INDvsSL: బంతి తగలడంతో ఏకాగ్రత కోల్పోయా!
టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ పృథ్వీ షా మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో విఫలమైన అతడిని జట్టు యాజమాన్యం పక్కనపెట్టిన సంగతి తెలిసిందే...
యువ ఓపెనర్ పృథ్వీ షా..
(Photo: BCCI Twitter)
కొలంబో: టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ పృథ్వీ షా మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో విఫలమైన అతడిని జట్టు యాజమాన్యం పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత తన బ్యాటింగ్లోని తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దుకున్నాడు. ఆపై దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో రాణించి తిరిగి భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం శ్రీలంకతో ఆడిన తొలి వన్డేలో రెచ్చిపోయాడు. అయితే, అతడు ఔటయ్యేముందు ఓవర్లో ఒక బంతి హెల్మెట్కు బలంగా తాకింది. దాంతో తాను ఏకాగ్రత కోల్పోయానని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.
శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్య ఛేదనలో పృథ్వీ(43; 24 బంతుల్లో 9x4), శిఖర్ ధావన్ (86 నాటౌట్; 95 బంతుల్లో 6x4, 1x6) ఓపెనింగ్ చేశారు. ఈ క్రమంలోనే పృథ్వీ తొలి ఓవర్ నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవర్కు రెండు ఫోర్ల చొప్పున ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలోనే చమీరా వేసిన ఐదో ఓవర్ చివరి బంతి అతడి హెల్మెట్కు బలంగా తాకింది. అప్పుడు హెల్మెట్ కూడా మెడభాగంలో కొంతవరకు విరిగిపోయింది. వెంటనే ఫిజియోలు వచ్చి పరీక్షించగా అతడికి పెద్ద గాయం అవ్వలేదని నిర్ధారించారు. దాంతో బ్యాటింగ్ కొనసాగించిన అతడు మరుసటి ఓవర్లోనే ఔటయ్యాడు. ధనంజయ వేసిన 5.3 ఓవర్కు భారీ షాట్ ఆడబోయి అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు. దాంతో టీమ్ఇండియా తొలి వికెట్ కోల్పోయింది.
ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతడు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు చెప్పాడు. ఈ మ్యాచ్లో ఎలా ఆడాలనే దాని గురించి కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏమీ చెప్పలేదని అన్నాడు. తన సహజసిద్ధమైన ఆటనే ఆడాలనుకున్నట్లు తెలిపాడు. తనకు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాలని అనిపించిందని, దాంతో చెత్త బంతుల కోసం వేచి చూసి షాట్లు ఆడానని పేర్కొన్నాడు. ఇక పిచ్ కూడా బాగా సహకరించిందని, అదే సమయంలో లంక పేస్ బౌలింగ్ను ఆస్వాదించానని వివరించాడు. చివరగా చమీరా వేసిన బంతి తలకు తగిలాకే ఏకాగ్రత కోల్పోయినట్లు పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు