IPL 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మరో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. దిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు మరికాసేపట్లో అబుదాబి వేదికగా తలపడనున్నాయి...

Updated : 25 Sep 2021 15:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మరో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. దిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు మరికాసేపట్లో అబుదాబి వేదికగా తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న దిల్లీ క్యాపిటల్స్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకోవాలని చూస్తోంది. ఇక గత మ్యాచ్‌లో అనూహ్య రీతిలో విజయం సాధించిన రాజస్థాన్‌ అలాంటి ప్రదర్శనే పునరావృతం చేసి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని చూస్తోంది.

దిల్లీ జట్టు: పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), లలిత్‌ యాదవ్‌, షిమ్రన్‌ హెట్‌మైర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రబాడ, నోర్జె, అవేశ్‌ ఖాన్‌

రాజస్థాన్‌ జట్టు: యశస్వి జైశ్వాల్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌), లివింగ్‌స్టన్‌, డేవిడ్‌ మిల్లర్‌, మహిపాల్‌, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, కార్తిక్‌ త్యాగి, చేతన్‌ సకారియా, ముస్తాఫిజర్‌, తబ్రేజ్‌ షంసి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని