India vs Srilanka: ద్రవిడ్ వల్లే ఇదంతా.. విజయంలో ఘనత అతడికీ ఇవ్వాలి
ఎన్సీయే చీఫ్ రాహుల్ ద్రవిడ్పై పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ప్రశంసల జల్లు కురిపించారు. యువకులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. శ్రీలంకతో రెండో వన్డేలో దీపక్ చాహర్ను ముందు పంపించడం ద్రవిడ్ .......
ఇంటర్నెట్ డెస్క్: ఎన్సీయే చీఫ్ రాహుల్ ద్రవిడ్పై పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ప్రశంసల జల్లు కురిపించారు. యువకులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. శ్రీలంకతో రెండో వన్డేలో దీపక్ చాహర్ను ముందు పంపించడం ద్రవిడ్ వ్యూహ చతురతకు నిదర్శనమని పేర్కొన్నారు. తన యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడారు.
‘ద్రవిడ్ కోచింగ్ శైలి బాగుంది. రెండో వన్డే విజయంలో ఘనత ఆయనకూ దక్కాలి. అండర్-19, భారత్-ఏ కోచ్గా ఆయన యువకులను తీర్చిదిద్దారు. వారిపై నమ్మకం ఉంచారు. ద్రవిడ్ వల్లే టీమ్ఇండియా రిజర్వు బెంచి అత్యంత పటిష్ఠంగా మారింది. మిస్టర్ వాల్ యువ కోచ్లా కనిపిస్తారు. దాంతో కుర్రాళ్లు సులభంగా ఆయనతో కలిసిపోతున్నారు. శ్రీలంక సిరీసు కోసం ఆయన కుర్రాళ్లకు చక్కని శిక్షణ ఇచ్చారు. దీపక్ చాహర్ సైతం ఒత్తిడిని ఎదుర్కొని అజేయంగా నిలిచాడు. తిరుగులేని విజయం అందించాడు’ అని రాజా అన్నారు.
అండర్-19, భారత్-ఏ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి పాక్ మాజీ క్రికెటర్లు ద్రవిడ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అతడి మార్గనిర్దేశం వల్లే భారత క్రికెట్ జట్టు మరింత దుర్భేద్యంగా మారిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు శ్రీలంకలో భారత జట్టుకు కోచ్గా వెళ్లడంతో భవిష్యత్తు భారత కోచ్గా అతడిని వర్ణిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?