Pakistan Cricket: ఈ పాశ్చాత్య దేశాలు అవసరమైతే ఏకమైపోతాయి: రమీజ్ రాజా
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా నిప్పులు చెరిగాడు. ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ జట్టు భద్రతా కారణాల రిత్యా తొలి వన్డే సందర్భంగా అర్ధాంతరంగా...
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల న్యూజిలాండ్ జట్టు భద్రతా కారణాల రిత్యా పాక్లో టోర్నీని రద్దు చేసుకొని వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పాక్ బోర్డు గుర్రుగా ఉంది. అయితే, తాజాగా ఇంగ్లాండ్ బోర్డు సైతం భద్రతా కారణాలతోనే తమ జట్లను (పురుషులు, మహిళలు) పాక్ పర్యటనకు పంపబోమని స్పష్టం చేసింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డుకు మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.
ఈ క్రమంలోనే రమీజ్ రాజా ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ అవసరమైతే పాశ్చాత్య దేశాలు ఏకమవుతాయని, పరస్పరం సహకరించుకుంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇంగ్లాండ్ జట్టు పాక్ పర్యటనలను రద్దు చేసుకోవడంతో చాలా నిరాశకు గురయ్యా. కానీ, ఇలా జరుగుతుందని ముందే ఊహించా. ఎందుకంటే దురదృష్టంకొద్దీ ఈ పాశ్చాత్య దేశాలు ఏకమైపోతాయి. దాంతో ఒకరికి ఒకరు సహకరించుకుంటారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఎవరైనా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ, మాకిప్పుడు కోపం ఉంది. ఎందుకంటే మొదట న్యూజిలాండ్ జట్టు ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఇక్కడి నుంచి వెళ్లిపోయింది’ అని రమీజ్ మండిపడ్డాడు.
మరోవైపు తన ట్విటర్లోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ‘ఇంగ్లాండ్ బోర్డు తమ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు.. అవసరమైన వేళ స్నేహపూర్వకమైన బోర్డుతో తమ క్రికెట్ అనుబంధానికి బీటలు వేసుకుంది. ఈ చర్యలు నన్నెంతగానో నిరాశపరిచాయి. అయితే, మేం ఎలాగైనా ఈ పరిస్థితుల నుంచి బయటపడతాం. ఇది పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కూడా మేలుకొలుపు. అది ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా తయారై ఇతర జట్లు కారణాలేవీ చెప్పకుండా తమతో పోటీపడేలా చేయాలి’ అని రమీజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్