INDvsENG: 1971లో ఇంగ్లాండ్పై విజయం.. విదేశాల్లో ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం కలిగించింది
టీమ్ఇండియా 1971లో ఇంగ్లాండ్పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలదనే నమ్మకం కలిగిందని హెడ్కోచ్ రవిశాస్త్రి తన చిన్ననాటి రోజులు గుర్తుచేసుకున్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా 1971లో ఇంగ్లాండ్పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలదనే నమ్మకం కలిగిందని హెడ్కోచ్ రవిశాస్త్రి తన చిన్ననాటి రోజులు గుర్తుచేసుకున్నాడు. ఆ చారిత్రక ఘట్టం జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీసీసీఐ నాటి మ్యాచ్ వీడియోను ట్విటర్లో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి స్పందిస్తూ ఆ రోజుల్లో తాను రేడియోలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నానని చెప్పాడు.
‘నేనప్పుడు తొమ్మిదేళ్ల కుర్రాడిగా ఉన్నా. ఆ మ్యాచ్ ఎలా సాగిందో నాకింకా గుర్తుంది. ప్రతి బాల్ను నేను రేడియో కామెంట్రీలో విన్నా. అప్పుడు ఫరూక్ ఇంజినీర్, గుండప్ప విశ్వనాథ్, అజిత్ వాడేకర్ తలా కొన్ని పరుగులు సాధించారు. అప్పుడు టీమ్ఇండియా సిరీస్ గెలవడం సంచలనంగా మారింది. దాంతో విదేశాల్లో ఎక్కడైనా గెలుస్తామనే ధీమా కలిగించింది. ఇక ఇంగ్లాండ్లో గెలవడం అనేది చారిత్రక ఘట్టం. ఇది జరిగి అప్పుడే 50 ఏళ్లు గడిచాయి. నాటి క్రికెటర్లు ఒక ఒరవడి సృష్టించారు. వాళ్లందరికీ హ్యాట్సాఫ్’ అంటూ శాస్త్రి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.
ఇదిలా ఉండగా, టీమ్ఇండియా 1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్కు వెళ్లింది. ఈ క్రమంలోనే లార్డ్స్లో జరిగిన తొలి టెస్టు, ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిశాయి. ఇక ఓవల్లో జరిగిన మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 355 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ జేమ్సన్(82), అలాన్ నాట్(90), రిచర్డ్ హ్యూటన్ (81) రాణించారు. ఆపై భారత్ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు విఫలమైనా అజిత్ వాడేకర్(48), దిలీప్ సర్దేసాయి(54), ఫరూక్ ఇంజినీర్ (59), ఏక్నాథ్ సోల్కర్(44) పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్ భగవత్ చంద్రశేఖర్ 6/38 మెరవడంతో ఆ జట్టు 101 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమ్ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయడంతో మ్యాచ్ గెలుపొందింది. దాంతో ఇంగ్లాండ్ గడ్డపై 1-0 తేడాతో తొలిసారి టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్