
INDvsENG: 1971లో ఇంగ్లాండ్పై విజయం.. విదేశాల్లో ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం కలిగించింది
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా 1971లో ఇంగ్లాండ్పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలదనే నమ్మకం కలిగిందని హెడ్కోచ్ రవిశాస్త్రి తన చిన్ననాటి రోజులు గుర్తుచేసుకున్నాడు. ఆ చారిత్రక ఘట్టం జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీసీసీఐ నాటి మ్యాచ్ వీడియోను ట్విటర్లో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి స్పందిస్తూ ఆ రోజుల్లో తాను రేడియోలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నానని చెప్పాడు.
‘నేనప్పుడు తొమ్మిదేళ్ల కుర్రాడిగా ఉన్నా. ఆ మ్యాచ్ ఎలా సాగిందో నాకింకా గుర్తుంది. ప్రతి బాల్ను నేను రేడియో కామెంట్రీలో విన్నా. అప్పుడు ఫరూక్ ఇంజినీర్, గుండప్ప విశ్వనాథ్, అజిత్ వాడేకర్ తలా కొన్ని పరుగులు సాధించారు. అప్పుడు టీమ్ఇండియా సిరీస్ గెలవడం సంచలనంగా మారింది. దాంతో విదేశాల్లో ఎక్కడైనా గెలుస్తామనే ధీమా కలిగించింది. ఇక ఇంగ్లాండ్లో గెలవడం అనేది చారిత్రక ఘట్టం. ఇది జరిగి అప్పుడే 50 ఏళ్లు గడిచాయి. నాటి క్రికెటర్లు ఒక ఒరవడి సృష్టించారు. వాళ్లందరికీ హ్యాట్సాఫ్’ అంటూ శాస్త్రి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.
ఇదిలా ఉండగా, టీమ్ఇండియా 1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్కు వెళ్లింది. ఈ క్రమంలోనే లార్డ్స్లో జరిగిన తొలి టెస్టు, ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిశాయి. ఇక ఓవల్లో జరిగిన మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 355 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ జేమ్సన్(82), అలాన్ నాట్(90), రిచర్డ్ హ్యూటన్ (81) రాణించారు. ఆపై భారత్ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు విఫలమైనా అజిత్ వాడేకర్(48), దిలీప్ సర్దేసాయి(54), ఫరూక్ ఇంజినీర్ (59), ఏక్నాథ్ సోల్కర్(44) పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్ భగవత్ చంద్రశేఖర్ 6/38 మెరవడంతో ఆ జట్టు 101 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమ్ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయడంతో మ్యాచ్ గెలుపొందింది. దాంతో ఇంగ్లాండ్ గడ్డపై 1-0 తేడాతో తొలిసారి టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్స్టోక్స్ను ఎలా ఔట్ చేశాడో చూడండి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
covid update: వీడని మహమ్మారి పీడ.. తెలంగాణలో కొత్తగా 457 కరోనా కేసులు
-
Sports News
IND vs ENG: రెండో సెషన్ పూర్తి.. నిలకడగా ఆడుతున్న విహారి, పుజారా
-
Sports News
Bumrah - Broad : బ్రాడ్కు బుమ్రా చుక్కలు.. నెట్లో వీరేంద్ర సెహ్వాగ్ చమక్కు
-
India News
Maharashtra: ప్రభుత్వం నేతలే ప్రతిపక్షంగా మారారు.. సీఎం పదవి దక్కడం యాదృచ్ఛికం: శిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Samantha: కరణ్.. అన్హ్యాపీ మ్యారేజ్కి మీరే కారణం: సమంత
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి