Ravi Shastri: అశ్విన్ను బాధపెట్టి ఉంటే.. అందుకు సంతోషమే: రవిశాస్త్రి
టీమ్ఇండియా సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను తన మాటలు బాధపెట్టి ఉంటే అందుకు సంతోషంగా ఉందని మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను తన మాటలు బాధపెట్టి ఉంటే అందుకు సంతోషమేనని మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా 2-1 తేడాతో తొలిసారి ఆ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. అయితే, సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో కుల్దీప్ యాదవ్ 5 వికెట్ల ప్రదర్శన చేయడంపై రవిశాస్త్రి ఆరోజు మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో తమ తొలి ప్రాధాన్య స్పిన్నర్ అతడేనని పేర్కొన్నాడు. కాగా, ఆ టెస్టులో చోటు దక్కని అశ్విన్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. శాస్త్రి మాటలు కలచివేశాయని, తనని బస్కింద తోసేసినట్లు అనిపించిందని ఇటీవల ఓ క్రీడాఛానల్తో వాపోయాడు. ఈ నేపథ్యంలో శాస్త్రి స్పందిస్తూ ఇలా బదులిచ్చాడు.
‘ఆ మ్యాచ్లో అశ్విన్ ఆడలేదు. కానీ, కుల్దీప్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కాబట్టి నేను అతడిని ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. నేనెలా చేయడం వల్లే అశ్విన్ మళ్లీ తన ఆటపై దృష్టిసారించి.. కొత్తగా ప్రయత్నించి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఎలాంటి భేషజాలు లేకుండా నిజాలు చెప్పడమే నా పని. అంతేకాని, ప్రతి ఒక్కరికీ వెన్న పూయడం కాదు. ఒక కోచ్ మిమల్ని పరీక్షిస్తే ఏం చేస్తారు? ఇంటికెళ్లి ఏడ్చుకుంటూ కూర్చొని నేను మళ్లీ ఆడను అంటారా? ఒక ఆటగాడిగా నేనైతే సవాళ్లను స్వీకరించి మెరుగవుతా. అలా నా కోచ్ చెప్పిన మాటలు తప్పని నిరూపించుకుంటా. కుల్దీప్ పట్ల నేను చేసిన వ్యాఖ్యలకు అశ్విన్ బాధపడి ఉంటే.. అందుకు నేను సంతోషిస్తున్నా. అందువల్లే అతడు సాధన చేసి తిరిగి జట్టులోకి వచ్చాడు’ అని మాజీ కోచ్ అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉండగా, ఆ సిడ్నీ టెస్టు తర్వాత కుల్దీప్ సరైన ప్రదర్శన చేయలేక జట్టులో చోటు కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు. మరోవైపు అశ్విన్ తన ఆటను మెరుగుపర్చుకొని బాగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా ఉన్న హర్భజన్ సింగ్ (417 వికెట్లు) రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం 427 వికెట్లతో కొనసాగుతున్న అశ్విన్ రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్లో మరో 8 వికెట్లు పడగొడితే కపిల్ దేవ్ (434)ను కూడా దాటిపోతాడు. దీంతో 619 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అనిల్కుంబ్లే తర్వాత రెండో స్థానాన్ని కైవసం చేసుకునే అరుదైన అవకాశం ముందుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు