INDvsENG: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో జడేజానా.. అశ్వినా?

టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో అద్భుత ప్రదర్శనతో కొనసాగుతోంది. సీమ్‌కు అనుకూలించే పిచ్‌లపై నాలుగు-ఒకటి ఫార్ములాతో అదరగొడుతోంది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో తొలి టెస్టులో బరిలోకి టీమ్‌ఇండియా...

Published : 22 Aug 2021 13:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో అద్భుత ప్రదర్శనతో కొనసాగుతోంది. సీమ్‌కు అనుకూలించే పిచ్‌లపై నాలుగు-ఒకటి ఫార్ములాతో అదరగొడుతోంది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో తొలి టెస్టులో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ఆధిపత్యం చలాయించింది. అయితే, వర్షం కారణంగా చివరిరోజు ఆట రద్దవ్వడంతో ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అదే ఫార్ములాతో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులోనూ భారత్‌ మెరుగైన ప్రదర్శన చేసింది. దాంతో అక్కడ విజయం సాధించి సిరీస్‌లో ముందంజలో నిలిచింది. ఈ క్రమంలోనే రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇలాగే విజయాలు సాధించి 13 ఏళ్ల తర్వాత ఇంగ్లిష్‌ గడ్డపై సిరీస్‌ గెలవాలని చూస్తోంది.

కాగా, మూడో టెస్టులో టీమ్‌ఇండియా స్పిన్‌ బౌలింగ్‌ విభాగంలో సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌ల్లో జడేజాను ఆడించినా.. ఆశించిన మేర రాణించలేకపోయాడు. తొలి టెస్టులో మొత్తం 16 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయిన అతడు తర్వాతి మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శనే పునరావృతం చేశాడు. ఈసారి మొత్తం 28 ఓవర్లు వేసినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు రెండో టెస్టులోనే తుది జట్టులో చోటు దక్కే అవకాశం వచ్చినా మ్యాచ్‌ ప్రారంభమయ్యే ముందు వర్షం కురవడంతో తనని తీసుకోలేదని తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో అశ్విన్‌ వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా మూడో టెస్టులో జడేజాను పక్కనపెట్టి అశ్విన్‌ను ఎంపిక చేసే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని