Dhoni: ధోనీ అభిమానులకు శుభవార్త.. మరో మూడేళ్లు సీఎస్కేలోనే!
వచ్చే ఏడాది ఐపీఎల్ ఈవెంట్ పది జట్లతో మరింత ఘనంగా జరగనుంది. అందుకు సంబంధించి డిసెంబర్లో మెగా వేలం కూడా నిర్వహించనున్నారు...
ఇంటర్నెట్డెస్క్: వచ్చే ఏడాది ఐపీఎల్ ఈవెంట్ పది జట్లతో మరింత ఘనంగా జరగనుంది. అందుకు సంబంధించి డిసెంబర్లో మెగా వేలం కూడా నిర్వహించనున్నారు. అయితే, దానికంటే ముందు ఈనెల 30నాటికి ప్రస్తుత జట్లు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించాలని ఆయా ఫ్రాంఛైజీలకు నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే చెన్నై తమ సారథి మహేంద్రసింగ్ ధోనీని మరో మూడేళ్లు అట్టిపెట్టుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాతో పాటు ఇంగ్లాండ్ ఆల్రౌండర్లు మొయిన్ అలీ లేదా సామ్ కరన్.. ఇద్దరిలో ఒకరిని తమవద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం.
ఇక ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్, పేసర్ జస్ప్రిత్ బుమ్రాతో పాటు యువ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్లను అట్టిపెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు రోహిత్ లేని సమయాల్లో జట్టును నడింపించే కీరన్ పొలార్డ్ను సైతం ముంబయి తమ వద్దే ఉంచుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్.. రిషభ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షాతో పాటు దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జ్లపై దృష్టిసారించింది. కాగా, ఈ ఏడాది కొత్తగా చేరిన జట్లలో సంజీవ్ గోయెంకా గ్రూప్ లఖ్నవూ ఫ్రాంఛైజీని చేజిక్కించుకోగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!