IPL 2021: పంత్‌ చాలా పరిణతి సాధించాడు: పాంటింగ్‌

గత రెండు సీజన్లలో యువ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ గొప్ప పరిణతి సాధించాడని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ‘‘గత రెండు సీజన్లలో పంత్‌ మరింత పరిణతి సాధించాడు.

Updated : 22 Sep 2021 07:04 IST

దుబాయ్‌: గత రెండు సీజన్లలో యువ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ గొప్ప పరిణతి సాధించాడని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ‘‘గత రెండు సీజన్లలో పంత్‌ మరింత పరిణతి సాధించాడు. నేను వచ్చిన కొత్తలో... పంత్‌ సత్తా చాటడం మొదలెట్టాడు. భారత్‌కు అతడు చాలా కాలం ఆడతాడని చెప్పా. పంత్‌ ప్రతి భారత జట్టులోనూ ఉండాలనే తపనతో ఉంటాడు. ఎంతో మేటి ఆటగాడైతే తప్ప భారత జట్టులో పంత్‌ స్థానాన్ని చేజిక్కించుకోలేడు. ఇప్పటివరకు అతడు కెప్టెన్‌గా దిల్లీ జట్టును గొప్పగా నడిపించాడు’’ అని పాంటింగ్‌ చెప్పాడు. శ్రేయస్‌ అయ్యర్‌ గాయంతో దూరం కావడంతో ఐపీఎల్‌ తొలి అంచెలో 23 ఏళ్ల పంత్‌ దిల్లీకి నాయకత్వం వహించాడు. ఇప్పుడు శ్రేయస్‌ తిరిగొచ్చినా.. రెండో అంచెలో కూడా పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని దిల్లీ నిర్ణయించింది. పంత్‌ సారథ్యంలో దిల్లీ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని