IPL 2021: ధోనీ భాయ్ వెన్నంటి ఉంటే.. ఎక్కువ ఆలోచించాల్సిన పనిలేదు: రుతురాజ్
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ, జట్టు యాజమాన్యం కలిసి ప్రోత్సహిస్తే ఇక దేని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని యువ బ్యాట్స్మన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు...
(Photo: Ruturaj Gaikwad Instagram)
ఇంటర్నెట్డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ, జట్టు యాజమాన్యం కలిసి ప్రోత్సహిస్తే ఇక దేని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని యువ బ్యాట్స్మన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. గతరాత్రి ముంబయితో తలపడిన మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అతడు జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన చెన్నైని రుతురాజ్(88*) ఆదుకున్నాడు. జడేజా(26), బ్రావో(23)తో కలిసి మంచి భాగస్వామ్యాలు నిర్మించాడు. ఈ క్రమంలోనే 20 ఓవర్లకు జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ కెప్టెన్ ధోనీ, జట్టు యాజమాన్యం ప్రోత్సహిస్తే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. ఇది కచ్చితంగా తన టాప్ ఇన్నింగ్స్ల్లో ఒకటని అన్నాడు. ఆదిలోనే పలు వికెట్లు కోల్పోయి, సీనియర్లు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ఒత్తిడి పరిస్థితుల్లో జట్టు స్కోరును 130 లేదా 140 పరుగులకు తీసుకెళ్లాలని అనుకున్నామని.. అయితే, చివరికి 150 పరుగుల మంచి స్కోరు సాధ్యమైందని తెలిపాడు. మరోవైపు ఈ టోర్నీకి ముందు శ్రీలంక పర్యటన కూడా తనకు ఉపయోగపడిందని యువ బ్యాట్స్మన్ వివరించాడు. తొలుత బంతి బాగా స్వింగ్ అయిందని, అలాంటప్పుడు తాను స్పిన్నర్ల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పాడు. జడేజా క్రీజులోకి వచ్చాక తాను అవకాశం తీసుకుని స్వేచ్ఛగా ఆడానని రుతురాజ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా