Sachin Tendulkar: సచిన్ @ 30,000.. @ పుష్కరకాలం పూర్తి
సచిన్ తెందూల్కర్ అంతర్జాతీయ క్రికెట్కు దూరమై ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అత్యధిక పరుగుల (34,347) వీరుడిగా అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడిలానే టీమ్ఇండియా...
ఇంటర్నెట్డెస్క్: సచిన్ తెందూల్కర్ అంతర్జాతీయ క్రికెట్కు దూరమై ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అత్యధిక పరుగుల (34,347) వీరుడిగా అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడిలానే టీమ్ఇండియా తరఫున పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ ఆ రికార్డును చేరాలంటే మరింత దూరం ప్రయాణించాలి. ప్రస్తుతం విరాట్ మూడు ఫార్మాట్లలో కలిపి 23,161 పరుగులతో ఉన్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో 30 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్గా సచిన్ కొనసాగుతున్నాడు. కాగా, ఈ దిగ్గజ బ్యాట్స్మన్ చేసిన పరుగులన్నీ టెస్టు, వన్డే క్రికెట్లోనే కావడం విశేషం. టీ20ల్లో ఈ మాజీ కెప్టెన్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి 10 పరుగులే చేశాడు. అయితే, అతడు అంతర్జాతీయ క్రికెట్లో 30 వేల పరుగులు పూర్తి చేసుకుంది ఈరోజే. అంటే సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2009 నవంబర్ 16-20 తేదీల మధ్య మొతేరా వేదికగా శ్రీలంకతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో శతకం సాధించి ఆ ఘనత నమోదు చేశాడు.
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 426 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ ద్రవిడ్ (177; 261 బంతుల్లో 26x4, 1x6), కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (110; 159 బంతుల్లో 10x4, 1x6) శతకాలతో మెరిశారు. అనంతరం లంక తొలి ఇన్నింగ్స్లో 760/7 స్కోర్ సాధించి నాలుగో రోజు చివరి సెషన్ ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మహేలా జయవర్దెనె (275; 435 బంతుల్లో 27x4, 1x6) భారీ ద్విశతకానికి తోడు తిలకరత్నె దిల్షాన్ (112; 133 బంతుల్లో 12x4), ప్రసన్న జయవర్దెనె (154; 314 బంతుల్లో 11x4) శతకాలతో రాణించారు. దీంతో టీమ్ఇండియా మ్యాచ్ను గెలిచే పరిస్థితి లేక డ్రా చేసుకుంది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చివరికి 412/4 స్కోర్ సాధించింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ (114; 230 బంతుల్లో 13x4), సచిన్ (100 నాటౌట్; 211 బంతుల్లో 11x4) శతకాలతో రాణించారు. ఈ క్రమంలోనే మాస్టర్బ్లాస్టర్ అంతర్జాతీయ క్రికెట్లో 30 వేల పరుగుల మైలురాయి చేరుకోవడమే కాకుండా కెరీర్లో 88వ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత సచిన్ మరో నాలుగేళ్లు టీమ్ఇండియాకు సేవలందించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.