IND vs NZ: ఇద్దరు రవీంద్రలు.. ఇద్దరు పటేల్లు.. ఒకేలా ముగింపు
క్రికెటర్లకు సంబంధించిన కొన్ని విషయాలు యాదృశ్చికంగా ఒకరికొకరివి కలుస్తుండటం సహజం. బ్యాటింగ్, బౌలింగ్, ఆటతీరు...
భారత్, కివీస్ జట్ల మధ్య కొన్ని పోలికలు మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: క్రికెటర్లకు సంబంధించిన కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా ఒకరికొకరివి కలుస్తుండటం సహజం. బ్యాటింగ్, బౌలింగ్, ఆటతీరు, జెర్సీ నంబర్.. ఇలా ఏదైతేనేమీ పోలికలు సరిపోతుంటాయి. అయితే ఒకే మ్యాచ్లో వారు ప్రత్యర్థులుగా ఎదురుపడటం అరుదుగా జరిగే విషయమే. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఇలాంటి అరుదైన అంశాలు కొన్ని ఉన్నాయి. మరి అవేంటో ఓ సారి చూద్దాం...
ఒకరిదేమో అంతర్జాతీయంగా 57 టెస్టుల అనుభవం.. మరొకరు ఇప్పుడే అరంగేట్రం చేసిన యువ క్రికెటర్.. అయితే వీరిద్దరి జెర్సీ నంబర్ (8) ఒకటే కావడం విశేషం. అదేవిధంగా ఇద్దరూ ఎడమచేతివాటం బ్యాటర్లు, బౌలర్లు.. అంతేనా.. ఆల్రౌండర్లు కూడానూ.. అయితే ఇప్పుడు ఒకే టెస్టు మ్యాచ్లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.. పేర్లలోనూ కాస్త సారూప్యత కలిగిన ఆ ఆటగాళ్లు.. రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర. టీమ్ఇండియా టాప్ ఆల్రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. కివీస్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో అర్ధశతకం సాధించాడు. బౌలింగ్లోనూ పొదుపుగా (33-10- 57-1) బౌలింగ్ చేశాడు. కివీస్ తరఫున అరంగేట్రం చేసిన రచిన్ రవీంద్ర ఇప్పటివరకైతే (తొలి ఇన్నింగ్స్ బౌలింగ్ గణాంకాలు 7-1-28-0) పెద్దగా ప్రభావం చూపలేదు. అటు బ్యాటింగ్లోనూ 13 పరుగులే చేశాడు. తొలి టెస్టు ఆడుతున్న రచిన్ రవీంద్రను ఆల్రౌండర్ రవీంద్ర జడేజానే క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం.
రెండు జట్లలోనూ ఎ. పటేల్లు..
టీమ్ఇండియా, కివీస్ జట్లలో ఎ.పటేల్ పేరు కలిగిన ఆటగాళ్లు ఉన్నారని మీకు తెలుసా..? అవును నిజంగానే.. అయితే షార్ట్కట్లో ఇద్దరి పేర్లు ఒకటే కానీ.. అసలు పేర్లైతే వేరేలేండి.. భారత్ తరఫున ఆడుతున్న ఎ.పటేల్ పూర్తి పేరు అక్షర్ పటేల్. మరి కివీస్ జట్టుకు ఆడే ఎ. పటేల్ కూడా ఉన్నాడు. అయితే అతడి పేరు అజాజ్ పటేల్.. కివీస్ తరఫున పది టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. మన అక్షర్కిది ఐదో టెస్టు మాత్రమే. అంతేకాదండోయ్.. ఇద్దరి పేర్లలోనూ పోలిక ఉన్నట్లే వారి బ్యాటింగ్, బౌలింగ్ శైలి కూడానూ ఒకటే. ఇద్దరూ లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్లు. ఎడమ చేతివాటం బ్యాటర్లు. అయితే అక్షర్ అప్పుడప్పుడూ బ్యాటింగ్ కూడా చేయగలడు కానీ.. అజాజ్ బౌలర్గానే ఎంపికయ్యాడు. రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ కుటుంబాలు భారతీయ సంతతికి చెందినవే.
రెండు రోజుల ముగింపు ఒకేలా...
తొలి రెండు రోజుల ముగింపు సందర్భంగా క్రీజ్లో ఉన్న బ్యాటర్ల స్కోరు ఒకేలా ఉండటం విశేషం. తొలుత టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని కివీస్కు బౌలింగ్ అప్పగించింది. అయితే జేమీసన్ దెబ్బకు టీమ్ఇండియా 145 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అరంగేట్ర బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (75*), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (50*) ఇన్నింగ్స్ను నిలబెట్టడంతో తొలి రోజు భారత్ 258/4 స్కోరుతో ఆటను ముగించింది. రెండో రోజు టిమ్ సౌథీ విజృంభణతో భారత్ 345 పరుగులకే కుప్పకూలింది. అయితే శ్రేయస్ అయ్యర్ (105) కెరీర్లో తొలి శతకం నమోదు చేసుకున్నాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు టామ్ లేథమ్ (50*), విల్ యంగ్ (75*) స్కోరుతో రోజును ముగించడం విశేషం. అయితే మూడో రోజు భారత బౌలర్ల దెబ్బకు కివీస్ 296 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్ఇండియాకు 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 14/1తో ఉంది. శుభ్మన్ గిల్ (1) త్వరగా ఔటవ్వగా.. క్రీజ్లో మయాంక్ అగర్వాల్ (4*), పుజారా (9*) ఉన్నారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 63 పరుగుల ఆధిక్యంలో భారత్ నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM