Shikhar Dhawan: ఐపీఎల్‌లో అదే జోరుతో కొనసాగాలి: ధావన్‌

కరోనా వైరస్‌కు ముందు ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎలా ఆడామో వచ్చేవారం నుంచి ప్రారంభమయ్యే రెండో దశలోనూ అలాగే రాణించాలని అనుకుంటున్నట్లు దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆశిస్తున్నాడు...

Published : 13 Sep 2021 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌కు ముందు ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎలా ఆడామో వచ్చేవారం నుంచి ప్రారంభమయ్యే రెండో దశలోనూ అలాగే రాణించాలని అనుకుంటున్నట్లు దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆశిస్తున్నాడు. మళ్లీ ఐపీఎల్‌ ఆడటం బాగుందని, జట్టులోనూ మంచి వాతావరణం నెలకొందని చెప్పాడు. తమ జట్టులోని ఆటగాళ్లు దుబాయ్‌లో బాగా కష్టపడుతున్నారని, దాంతో టోర్నీ పునః ప్రారంభానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. రెండో దశలోనూ తాము విజయంతోనే ఆరంభించాలనుకుంటున్నట్లు చెప్పాడు. అదెంతో ముఖ్యమని, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నామన్నాడు.

ఇప్పుడు తాము చేసే సాధనతో విజయాలు సాధించాలని ధావన్‌ ఆకాంక్షించాడు. ఏప్రిల్‌లో ఈ సీజన్‌ మొదలైనప్పుడు దిల్లీ క్యాపిటల్స్‌ విజయపథంలో నడిచిందని, అయితే.. టోర్నీ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఆ ఫ్లో మిస్సయ్యామని తెలిపాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి విజయ ప్రస్థానం కొనసాగించాలని దిల్లీ ఓపెనర్‌ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాము కోల్పోయిన శక్తి సామర్థ్యాలు తిరిగి పొందాలనుకుంటున్నట్లు తెలిపాడు. మరోవైపు మిగిలిన సీజన్‌కు కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ అందుబాటులోకి రావడంతో తమ జట్టు మరింత బలపడిందని చెప్పాడు. దీంతో రాబోయే మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా ఆడతామని ధావన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని