Mohammed Siraj: సిరాజ్ ష్..! సంబరాలు అనవసరం.. అలా చేయొద్దు
తొలి టెస్టులో జానీ బెయిర్స్టో ఔటైనప్పుడు మహ్మద్ సిరాజ్ ష్..! అంటూ చేసుకున్న సంబరాలు అనవసరమని వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగే కొద్దీ అతడు ఇవన్నీ నేర్చుకుంటాడని పేర్కొన్నాడు....
లండన్: తొలి టెస్టులో జానీ బెయిర్స్టో ఔటైనప్పుడు మహ్మద్ సిరాజ్ ష్..! అంటూ చేసుకున్న సంబరాలు అనవసరమని వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగే కొద్దీ అతడు ఇవన్నీ నేర్చుకుంటాడని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ను ఓడించేందుకే టీమ్ఇండియా బ్రిటన్లో పర్యటిస్తోందని వెల్లడించాడు.
తొలి టెస్టులో సిరాజ్ దూకుడుగా ప్రవర్తించాడు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్పై కొన్నిసార్లు మాటల దాడికి దిగాడు. అంతేకాకుండా బెయిర్ స్టో ఔటవ్వగానే ష్..! అంటూ సైగలు చేస్తూ అతడికి పెవిలియన్ దారి చూపించాడు.
‘సిరాజ్ అలా చేయడం అనవసరం. అప్పటికే యుద్ధం గెలిచావ్! మళ్లీ అలా రెచ్చగొట్టడం ఎందుకు? అంతర్జాతీయ కెరీర్లో ఎదిగే క్రమంలో అతడు ఇవన్నీ నేర్చుకుంటాడు. టీమ్ఇండియా సభ్యుడిని శాంతింపజేసేందుకు విరాట్ కోహ్లీ ఎన్నిసార్లు బరిలోకి దిగాడో మనం ఊహించుకోవచ్చు. అలాంటిది సిరాజ్ గీత దాటకుండా ఉండేందుకు కోహ్లీ వెంటనే రంగంలోకి దిగాడు’ అని దినేశ్ అన్నాడు.
‘ఇప్పటి టీమ్ఇండియా బ్రాండ్ క్రికెట్ను నేను ఇష్టపడతాను. ప్రత్యర్థులకు బదులిచ్చేందుకు ఎవ్వరూ వెనకడుగు వేయడం లేదు. సిరాజ్, కేఎల్ రాహుల్ అలా చేయడం చూశాం. ఇది సరికొత్త భారత్. తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేందుకు అనుమతి లభించింది’ అని డీకే అన్నాడు. కాగా దూకుడు అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని అతడు పేర్కొన్నాడు.
‘విరాట్, సిరాజ్, రాహుల్ బహిరంగంగా, ముఖం పైనే బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. సీనియర్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, పుజారా, అజింక్య రహానె ఆ దారిలో నడవరు. అయితే వారిలో దూకుడు లేదనుకోవద్దు. విచిత్రంగా టీమ్ఇండియా పేసర్లు భౌతికంగా దూకుడు ప్రదర్శించరు. బంతితో తమ పని జరిగితే చాలన్నట్టు ఉంటారు. ఇక విదేశాల్లో టీమ్ఇండియా రాణించేందుకు విరాట్ కోహ్లీ దూకుడు, బౌలర్ల దాడే కారణం. ఇప్పటికే ఆస్ట్రేలియాను రెండుసార్లు ఓడించారు. ఇప్పుడు ఇంగ్లాండ్ పని పడతారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సంగతి చూస్తారు. వారిలో ఆ ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది’ అని డీకే అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!