Sourav Ganguly: సౌరభ్‌గంగూలీకి కరోనా పాజిటివ్

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్ష ఫలితాలు గతరాత్రే విడుదలయ్యాయి...

Updated : 28 Dec 2021 13:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన నిన్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో.. ఆస్పత్రిలో చేరారు. కోల్‌కతాలోని వుడ్‌లాండ్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని.. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గతంలో గంగూలీ కుటుంబసభ్యులు సైతం ఈ వైరస్‌ బారిన పడ్డారు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో దాదా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స కూడా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని