INDvsENG: ఇంగ్లాండ్ పుంజుకోవాలంటే అద్భుతం జరగాలి: సన్నీ
ప్రస్తుతం టీమ్ఇండియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కోలుకోవాలంటే అద్భుతం జరగాలని మాజీ సారథి సునీల్ గావస్కర్ అన్నాడు. ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన...
ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుతం టీమ్ఇండియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కోలుకోవాలంటే అద్భుతం జరగాలని మాజీ సారథి సునీల్ గావస్కర్ అన్నాడు. ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే రెండో టెస్టులో టీమ్ఇండియా మానసికంగా ఎంతో దృఢత్వం సంపాదించిందని చెప్పాడు. దాంతో ఆతిథ్య జట్టు పుంజుకోవడం కష్టమని దిగ్గజ బ్యాట్స్మన్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్లో ఏదైనా జరగొచ్చని, ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారు అవ్వొచ్చని తెలిపాడు. అందుకు అద్భుతం జరగాలన్నాడు.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు ఉదయం పూట ఇంగ్లాండ్ గెలుస్తుందని అంతా అనుకున్నారని, కానీ ఐదోరోజు ఆటలో కనీసం 180 పరుగులైనా చేయడం కష్టతరమైందని గావస్కర్ వివరించాడు. ఈ క్రమంలోనే ఆతిథ్య జట్టు 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైందన్నాడు. అలాగే ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ బ్యాటింగ్ చేయలేరని గుర్తుచేశాడు. అతడి మీదే ఆ జట్టు అధికంగా ఆధారపడుతుందని వెల్లడించాడు. దాంతో రూట్ను ఔట్ చేస్తే ఇంగ్లాండ్ పని ఖతమైనట్టేనని మాజీ బ్యాట్స్మన్ పేర్కొన్నాడు. చివరగా బెన్స్టోక్స్పై స్పందిస్తూ.. తానే ఇంగ్లాండ్ కెప్టెన్ అయి ఉంటే ఆటకు దూరంగా ఉన్న అతడిని తిరిగి జట్టులో కొనసాగమని కోరేవాడినని అన్నాడు. స్టోక్స్ అరుదైన క్రికెటర్ అని, అలాంటి వ్యక్తి ఆటకు దూరంగా ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ