IND vs NZ: అది బౌల్ట్ ఇచ్చిన కానుక : సూర్య
టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (62) దంచికొట్టిన సంగతి తెలిసిందే...
ఇంటర్నెట్డెస్క్: న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (62) దంచికొట్టిన సంగతి తెలిసిందే. అయితే, అతడు కీలక ఇన్నింగ్స్ ఆడినా చివరి దశలో బౌల్ట్ బౌలింగ్లో ఔటయ్యాడు. రోహిత్ (48)తో కలిసి మ్యాచ్ గమనాన్ని మార్చేసిన సూర్య 17వ ఓవర్లో బౌల్డయ్యాడు. దీంతో టీమ్ఇండియా 144 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అయితే, సూర్య 57 పరుగుల వద్ద ఉండగా ఓ షాట్ ఆడాడు. ఆ క్యాచ్ను బౌల్ట్ జారవిడిచాడు. మ్యాచ్ అనంతరం స్పందించిన సూర్య.. తన భార్య పుట్టిన రోజుకు బౌల్ట్ ఇచ్చిన కానుక అది (క్యాచ్ వదలడం) అని సరదాగా వ్యాఖ్యానించాడు.
‘‘ఈ మ్యాచ్లో కొత్తగా ఏమీ చేయలేదు. గత మూడు, నాలుగేళ్లుగా ఎలా ఆడుతున్నానో అలాగే బ్యాటింగ్ చేశా. నెట్స్లో ఎలాంటి సాధన చేస్తున్నానో దాన్నే మైదానంలోనూ పునరావృతం చేశాను. నా ఆట తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకొంటాను. ఎలా ఆడితే మంచిదో ఆలోచిస్తాను. ఈ మ్యాచ్లో మంచు ప్రభావంతో బంతి తేలిగ్గానే బ్యాట్ పైకి వచ్చింది. దీంతో షాట్లు ఆడటం తేలికైంది. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది. అయితే, నేనే స్వయంగా ఈ మ్యాచ్ని గెలిపించి ఉంటే మరింత ఎక్కువగా ఆనందించేవాడిని. కానీ, ఇలాంటి పరిస్థితుల నుంచే మనం నేర్చుకొని ముందుకు సాగుతాం. ఇక బౌల్ట్ నా క్యాచ్ను వదిలేసిన విషయానికి వస్తే.. ఈ రోజు నా భార్య పుట్టినరోజు. ఆమెకు అతడిచ్చిన సరైన బహుమానం’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..