T20 World Cup: టీమ్ఇండియా కప్ కొట్టాలంటే ఈ జట్లతోనే ప్రమాదం..!
టీమ్ఇండియా ఈ టీ20 ప్రపంచకప్లో బలంగా కనిపిస్తున్నా మనవాళ్లకు గట్టి పోటీనిచ్చే, కప్పు గెలిచే సామర్థ్యం ఉన్న జట్లు మూడున్నాయి....
ముప్పు ఆ మూడింటితోనే..
ఇంటర్నెట్డెస్క్: ఈ టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా బలంగా కనిపిస్తున్నా మనవాళ్లకు గట్టి పోటీనిచ్చే, కప్పు గెలిచే సామర్థ్యం ఉన్న జట్లు మూడున్నాయి. అవే ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్. అయితే, సూపర్-12లో భారత్, న్యూజిలాండ్ ఒకే గ్రూప్లో ఉండటంతో తొలి ప్రమాదం కివీస్ నుంచే పొంచి ఉంది. ఒకవేళ ఇక్కడ ఓడినా భారత్ పాకిస్థాన్, అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లపై గెలుపొంది సెమీస్కు చేరే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు మరో గ్రూప్లో ఉండటంతో టీమ్ఇండియాతో సెమీస్లో పోటీపడే అవకాశం ఉంది. దీంతో కోహ్లీసేనకు నాకౌట్లోనే అసలు ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఆ మూడు జట్లు ఎలా ఉన్నాయి.. ఆటగాళ్లు ఎలా ఉన్నారు.. ఇదివరకు వారి ప్రదర్శన ఎలా ఉంది..?
వన్డే ప్రపంచకప్ గెలిచిన జోష్లో ఇంగ్లాండ్..
(Photo: England Cricket Twitter)
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంగ్లాండ్ జట్టు గురించే. 2015 వన్డే ప్రపంచకప్లో ఘోర వైఫల్యం తర్వాత ఈ జట్టు ఆటే మారిపోయింది. టెస్టు జట్టుగా ఉన్న ముద్రను పోగొట్టుకుంటూ దూకుడైన ఆటతో వన్డేలు, టీ20ల్లో మేటి జట్టుగా ఎదిగింది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్ను గెలిచి చరిత్ర సృష్టించింది. బట్లర్, రాయ్, మలన్, బెయిర్స్టో లాంటి విధ్వంసకారులు.. మొయిన్ అలీ, లివింగ్స్టోన్, సామ్ కరన్ లాంటి ఆల్రౌండర్లతో ఆ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. అవసరమైతే జోర్డాన్, వోక్స్, విల్లీ లాంటి బౌలర్లూ బ్యాటుతో రాణించగలరు. సమతూకంతో, ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇంగ్లాండ్ను భారత్ ఎదుర్కొంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
విండీస్ ప్రమాదకరమే..
(Photo: West Indies Cricket Twitter)
మరోవైపు టీ20ల్లో వెస్టిండీస్ ఎంత ప్రమాదకరమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టీ20 ప్రపంచకప్ను రెండుసార్లు గెలిచిన ఏకైక జట్టు అదే. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల్లో ఎక్కువ మ్యాచ్లాడి ఈ ఫార్మాట్లో రాటుదేలిపోయారు విండీస్ వీరులు. లూయిస్, సిమన్స్, ఫ్లెచర్, పొలార్డ్, గేల్, రసెల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ ఆ జట్టు సొంతం. ఆల్రౌండర్లకూ కొదవలేదు. లోతైన బ్యాటింగ్ విండీస్కు మరో బలం. ఏ స్థితిలోనైనా ఫలితాలను మార్చేసే ఆటగాళ్లు కరీబియన్ జట్టులో మెండుగా ఉన్నారు.
కివీస్ తక్కువేమీ కాదు..
(Photo: Blackcaps Twitter)
ఇక కప్పు వేటలో అండర్ డాగ్గా బరిలో ఉన్నది న్యూజిలాండ్ జట్టు. వన్డే, టీ20 ప్రపంచకప్ రెండింట్లోనూ కివీస్ను ఎప్పుడూ ఫేవరెట్గా పరిగణించరు కానీ.. ఎంతో నిలకడగా ఆడే జట్టది. వార్మప్ మ్యాచ్లు రెండింట్లోనూ ఓడిపోయినా, ఇటీవలి ఫామ్ ఏమంత బాగా లేకున్నా కివీస్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కివీస్కు ఎప్పుడూ ఆల్రౌండర్ల అండ ఉంటుంది. ఈసారి నీషమ్, మిచెల్, శాంట్నర్, ఉన్నారు. వీరికి తోడు బ్యాటింగ్లో విలియమ్సన్, గప్తిల్, కాన్వాయ్, ఫిలిప్స్.. బౌలింగ్లో బౌల్ట్, సౌథీ, జేమీసన్, ఫెర్గూసన్, ఇష్ సోధి లాంటి నాణ్యమైన ఆటగాళ్లతో కివీస్ బలంగా కనిపిస్తోంది. సెమీస్కు భారత్తో పాటుగా పై మూడు జట్లే వచ్చే అవకాశముంది. వీటిని దాటితేనే భారత్కు కప్పు దక్కే ఛాన్సుంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల అవకాశాలనూ కొట్టిపారేయలేం కానీ.. వాటి నుంచి భారత్కు ముప్పు తక్కువే.
టీమ్ ఇండియాలో కీలక ఆటగాళ్లు : కోహ్లి, రోహిత్, రాహుల్, బుమ్రా, షమి, జడేజా.
భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, జడేజా, అశ్విన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, షమి, బుమ్రా, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్.
స్టాండ్బైలు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?